Wednesday, March 6, 2019

On Sri Nrisimha Swamy

ప్రణవమ్ము సేయవలదు నేను నీకు ప్రణామమ్మె యొనర్చగలను
పరిణతిని పొందలేదు నేను పద్ధతిని తలుచుచుంటి
పాపమ్ము సేయనీకు నీ పాదమ్మె శరణు అంటి
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి


ప్రహ్లాద బ్రోచిన వాడవీవు ప్రతి ఒక్కరిని గావుమయ్య
పోతన భాగవమంతటా నిలిచిన వాడవీవు ఈ పుడమి నెల్ల జూచుమయ్య
ప్రజలెల్ల కొలుతురు నిన్నె పసిబిడ్డల వోలె సాకుమయ్య
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

జగములెల్ల పాలించు వాడవు జయములెల్ల నొసగువాడవూ
జనులను జూచుటకు జలములెత్తేటీ వాడవూ
జీర్ణమై పోయేటి స్థితిన జీవమ్ము నిస్తావు
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

నిను గొల్చిననూ నీ నామమ్ము తలచినంతటి యెడల
నిజం రూపము ననొచ్చీ నిలిచేటీ నా తండ్రి
నీరెండలోనైన నిశి రాతిరి నాడైనా నీ నీడ జాలునూ నిక్కమ్ము నిదియె గదా!!
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

కైవల్యమ్మునడుగజాల నేను నిన్ను కారుణ్యమెయొనర్చమంటి
కనకమడుగ నిను నేను కరుణ చాలంటీ
కష్టమ్ము తీసేయవె కలిగినా తీర్చేయవె
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

కనుల నిండుగ నీ రూపమె నిలుపు కొని యుంటీ
కృప జూపమని అడిగితె కృష్ణవై నిలబడవె
కుచేలుని వోలె మముకూడ సూడవె
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి


నీ పథముచేరిన పిదప నిను గొలువ నింక ఒద్దు అంటె
నిను పొందినాకా ఇక పిలువ వలదులే అంటే
మోక్షమ్ము కోరనే నా తండ్రి నీ పైన మనసునే చాలంటి
నన్ను ఉద్ధరించు నారసింహ నన్నేలు నా తండ్రి

-- కలం పేరు నాగిని


ప్రహ్లాద వరదా నరసింహ
ఫలములనొసగే నీ దీవెన
వైకుంఠమున నీవు నిలిచిన నూ
భక్తుల మదిలోకే ఒరిగితివా

స్వామిని చూడగానే కలిగింది ఈ భావన
వెంటనే చేశాను అక్షరీకరణ

2 comments:

Unknown said...

chala feel tho rasavu. bagundhi.

Durga Madhuri said...

Thank You Da...