Wednesday, April 22, 2020

కరోనా కీ భగవంతునికీ అనుసంధానం చేస్తూ వ్రాసిన పాట

తిరుమల వాసా శ్రీశైలేశా
విశ్రాంతి పొందగ రారండీ
శుచి యే స్వర్ణమని సూక్ష్మం సూచన
ఈ భక్తులకెల్లా తెలపండీ

భువినందేనా మరి మదినందు
లేరా మీరెల్లా ||2||
భగవంతుడిని చూచుటయంటే కాదే అది మన తరమెల్లా

ఇసుకకు సైతం జాగా లేక క్షేత్రాలు
ఇరుకైపోయీ జరుగుచుండే తోపులాటలూ
ఇబ్బందులు సైతం వదిలీ మేమంతా
ఇహపరమైన కోర్కెల చిట్టా విప్పేమే మరి మీ వద్దా

ఇందుకనేనా స్పందించారూ మీరంతా
ఇలయందందరిని కూర్చోపెట్టీ
ఇళ్ళల్లోనే నిలిపారూ
ఇంతటి కధనూ నడిపారూ

పునఃప్రారంభం అంటే మామూలూ కాదే
పురిటీ వంటిదీ పుడమీకీ
చిత్తశుద్ధితో ఇకపై మరి మనమంతా
ఇంపుగా నిలిపీ అందిద్దామూ ముందు తరాలకూ

No comments: