Thursday, October 17, 2024

To read to learn Poetry

 విశ్వనాథ వారి రచనలు ఇంతవరకూ చదవనివారు, చదావాలన్న ఆసక్తి ఉండి చదవగలమా అనుకునేవారు, ముందుగా వారు వ్రాసిన "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ఆపైన "హాహా హు హు" చదివితే వారి రచనలంటే "కొందరు" కలిగించిన భయం పోతుంది. అలాగే "పాతి పెట్టిన నాణెములు", "జేబు దొంగ నవలలు" కూడా.


మనుచరిత్ర 

భాస్కర శతకము 

బర్హిలేశ్వర శతకము - 3 గాయత్రమ్మ గారు చెప్పినవి

Wednesday, October 16, 2024

అనంత ఛందము

 నీ దరి చేరుట ధ్యేయము!

మోదము నీ సన్నిధి గద! భూమిన ప్రజకున్

రాదే శోకము! తలచిన!

శ్రీ దాక్షాయణి! నిను మది! క్షేమము గలుగున్

Puujalu

 Vaddiparthi పద్మాకర్ గారు చెప్పారు అక్క, గత జన్మలో ఈశ్వరుడికి పూజ చేస్తే డబ్బులు ఉంటాయట, దుర్గా పూజ చేస్తే అర్థం చేసుకునే భార్య /భర్త వస్తారట, విష్ణువుకి పూజ చేస్తే అధికారం పదవి వస్తాయట, శివపార్వతుల పూజ చేస్తే ఎంత  కష్టంలో ఐనా ఒక సుఖం ఇస్తారట, రుద్రాభిషేకం చేస్తే కవిత్వం, జ్ఞానం, సంగీత జ్ఞానం వస్తాయట. నేను అందుకే శివుడు అమ్మవారు బాగా నమ్ముతాను ఈ జన్మ ఇలా ఉంది వచ్చే జన్మ ఏమో అని


సౌందర్యలహరి ఐదవ శ్లోకం 108 సార్లు చదివి పళ్ళు లేదా పాలు నైవేద్యం పెట్టాలి ఉదయం లేదా సాయంత్రం వీలైతే ఐదు - ఆరు గంటల మధ్యలో - ఎదుటివారు మంచిగా మారటానికి








జనవరి 30 నుండి శ్యామల దేవి గుప్త నవరాత్రులు మొదలు...


మాస నివేదన:

 ఆవు నెయ్యి 

తిథి నివేదనలు:

పాడ్యమి ‌‌:ఆవు నెయ్యి 

విదియ: పంచదార 

తదియ: క్షీరం 

చవితి:ఆపూపములు

పంచమి: అరటి పండు 

షష్ఠి: తేనె 

సప్తమి: బెల్లం 

అష్టమి: నారికేళం 

నవమి: పేలాలు

Wednesday, October 9, 2024

NavaDurgas

 దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా 


1. #శైలపుత్రి 


ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.


2. #బ్రహ్మచారిని


ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉంది. దుర్గామాత రెండవ అవతారం ఇదేనని చెబుతారు. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి ఉంటారు. శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి ఆదేశానుసారం ఘోర తపస్సు చేసినది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే విజయం లభిస్తుందని చెబుతారు.


3. #చంద్రఘంట 


శ్రీ దుర్గామాత మూడవ అవతారం చంద్రఘంట అవతారం. ఈ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి ఉంటుంది. ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. ఈ అమ్మవారు దశ భుజాలతో దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయం, అపజయం దరికి రావు అని నమ్మకం.


4. #కూష్మాండ 


శ్రీ దుర్గామాత నాలుగవ అవతారం కూష్మాండ. ఈ అమ్మవారు సింహ వాహనం పైన అష్టభుజాలతో దర్శనం ఇస్తుంది. అందుకే ఈ అమ్మవారిని అష్టభుజి దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారి ఆలయం కాన్పూర్ లో ఉంది. ఈ అమ్మవారిని ఆరాదిస్తే శీఘ్రంగా కటాక్షించి రక్షిస్తుంది.


5. #స్కందమాత


నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి అని అర్ధం. స్కందుడి తల్లి కనుక ఈ దేవిని స్కందమాత అని అంటారు. ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవిని ఆరాదిస్తే పతనం లేకుండా కనుకరిస్తుంది.


6. #క్యాత్యాయని


నవదుర్గలలో ఆరవ అవతారం క్యాత్యాయని. కోత్స అనే ఒక ఋషి పార్వతీదేవి తనకి కూతురిగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేయగా అతడి కూతురిగా జన్మించింది. అందువలనే ఈ దేవికి క్యాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అవతారంలో దర్శనం ఇచ్చే ఆ దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.


7. #కాళరాత్రి 


నవదుర్గలలో ఏడవ అవతారం కాళరాత్రి. ఈ దేవి శరీరం ఛాయా చీకటి తో నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చినది. ఈ దేవి వాహనం గాడిద. ఎల్లప్పుడూ శుభ ఫలితాలు ఇస్తుంది కనుక ఈ దేవిని శుభకరీ అని కూడా అంటారు. ఈ దేవి ఆలయం కూడా వారణాసి లో ఉంది.


8. #మహాగౌరి 


నవదుర్గలలో ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళ కాంతితో శోభిస్తుంటుంది. అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోర తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది. ఇక ఆ దేవి భక్తికి మెచ్చిన స్వామివారు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు. అప్పటినుండి ఆమె మహాగౌరి గా ప్రసిద్ధి చెందింది.


9. #సిద్ధిధాత్రి


శ్రీ దుర్గా మాత అవతారాలలో తొమ్మిదవ అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతని దేవతలు, సిద్దులు, మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు. ఈ దేవి బుద్ది, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.


ఈవిధంగా శ్రీ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఉండగా.... ఈ తొమ్మిది అవతారాలకు సంబంధించిన ఆలయాలు అన్ని కూడా వారణాసి లో ఉన్నాయి.