[10/05, 07:32] +91 90147 09041: _*🌷శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🌷*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 ముందుమాట:*_
_లోకంలో కష్టాలు కలిగినప్పుడూ, బాధలు కలిగి నప్పుడూ మంత్రశాస్త్రంలో అందునా "శ్రీ విద్య"లో ప్రవేశమున్న వారంతా ‘సప్తశతి' పారాయణ చేస్తుంటారు. చెయ్యటం రాకపోతే ఎవరితోనైనా చేయిస్తుంటారు. సప్తశతి పారాయణ చేసినట్టైతే కష్టాలు తొలిగిపోయి సుఖశాంతులతో వర్థిల్లుతారనేది అక్షరసత్యం._
_దేవీనవరాత్రులలో గాని, ముఖ్యమైన ఇతర దినాలలోగాని సప్తశతి హోమం కూడా చేస్తారు. ఇది సర్వకార్యసిద్ధి. అయితే సప్తశతి అంటే ఏమిటి? అందులో ఏం చెప్పబడింది? అనే విషయాలు చాలామందికి తెలియవు. రామకృష్ణమఠం, బాలసరస్వతీ బుక్ డిపోల వంటివారు సప్తశతిలోని శ్లోకాలకు అర్థం మాత్రం వ్రాశారు. అవి కొంత వరకూ ఉపయోగమే._
_*సప్తశతి మొత్తం మూడు భాగాలుగా, పదమూడు అధ్యాయాలుగా ఉంటుంది. మొదటి భాగము ప్రథమచరితము. ఇందులో మధుకైటభుల వథ చెప్పబడింది. రెండవభాగము మథ్యమ చరితము. ఇందులో మహిషాసుర వధ చెప్పబడింది. మూడవ భాగము ఉత్తమ చరితము. ఇందులో శుంభ నిశుంభుల వథ చెప్పబడింది. ఈ మూడు భాగాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల రూపాలు. పరమేశ్వరి ఆ రూపాలలో రాక్షససంహారం చేసింది. ఇందులోని మొదటి అధ్యాయంలో బ్రహ్మదేవుడు చేసిన పరమేశ్వరి స్తుతి, నాల్గవఅధ్యాయంలో శక్రాదిస్తుతి, ఐదవ అధ్యాయంలో దేవతలు చేసిన స్తుతి, పదకొండవ అధ్యాయంలో నారాయణీస్తుతి చాలా ముఖ్యమైనవి. కేవలము ఈ స్తోత్రాలను పఠించినంత మాత్రం చేతనే, సప్తశతి పారాయణ చేసిన ఫలితము వస్తుంది. అందుచేత గ్రంథం వ్రాసేటప్పుడు ఈ స్తోత్రాలకు సాధ్యమైననంత వరకు విశేషవాఖ్య చెయ్యటం జరిగింది.*_
_గతంలో నేను గరుడ పురాణం, శ్రీ లక్ష్మి నరసింహ పురాణం, ఈ దత్త పురాణం ఇలా అనేక గ్రంథాలను పోస్టు చేశాను. వీటన్నిటిని ఎలా ఆదరించారో సప్తశతి కూడా ఆదరిస్తారని ఆశిస్తూ... ధన్యవాదములు._
_*రేపటి నుండి మొదలుపెడదాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[10/05, 07:33] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 1వ భాగం:*_
_*👉 ప్రథమ చరితము:*_
_*👉 ప్రథమాధ్యాయము:*_
_*ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన శూలం భుశుండీం శిరః*_
_*శంఖం సన్దధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ ।*_
_*యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టావసుప్తేహరౌ*_
_*నీలాశ్మ ద్యుతి మాస్య పాద దశకాం సే వే మహాకాళికామ్ ॥*_
_ఈ శ్లోకంలో మొట్టమొదటగా మహాకాళిని ధ్యానిస్తున్నారు. ఆమె పది చేతులు గలది. ఆ చేతులయందు ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, ఇనుపకట్లు వేసిన గుదియ, శూలము, భుసుండి అనగా మానవశిరస్సును పోలిన ఆయుధము, శంఖము మొదలైన వివిధ రకాలైన ఆయుధములు ధరించినది, మూడు కనులుగలది, అన్ని అంగములయందు ఆభరణములు ధరించినది. అనగా సర్వాభరణభూషితమైనది, పదిముఖములు, పది పాదములు గలది, విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మధుకైటభులను సంహరించటం కోసం బ్రహ్మదేవుని చేత స్తుతించబడినది, ఇంద్రనీలములవలె నల్లని శరీరకాంతి గలది అయిన మహాకాళిని ధ్యానించుచున్నాను._
_*ఇందులో మొత్తం 104 శ్లోకాలున్నాయి.*_
_ఇక ప్రథమాధ్యాయము:_
_*ఓం నమశ్చండికాయై |*_
_ఓంకార రూపిణి అయిన చండీదేవికి నమస్కారము._
_*ఓం ఐం మార్కండేయ ఉవాచ ॥*_
_మార్కండేయుడు చెబుతున్నాడు. అసలు ఎవరీ మార్కండేయుడు? విధాత యొక్క కుమారుడు మృకండుడు. ఇతడి భార్య మనస్విని. ఇతడే మృకండ మహర్షి అని పేరు పొందాడు. ఈ మహర్షికి చాలాకాలం సంతానం కలగలేదు. ఒక రోజున మృకండుడు మిగిలిన మహర్షులతో కలిసి బ్రహ్మదేవుని దర్శించటం కోసం సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ "సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు. నీవు సంతానహీనుడవు కాబట్టి నీకు ఈ లోకంలోకి ప్రవేశం లేదు" అని ద్వారపాలకులు మృకండ మహర్షిని లోపలికి పోనీయకుండా ఆపేశారు. చేసేదిలేక ఇంటికి వచ్చి జరిగిన దంతా భార్యతో చెప్పి దుఃఖించాడు మృకండ మహర్షి._
_కొంతకాలం తరువాత ఈ మహర్షి దంపతులు హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై 'ఏ వరంకావాలో కోరుకోండి' అన్నాడు. వెంటనే ఆ దంపతులు 'సంతానభాగ్యం కావాలి' అన్నారు. దానికి ఈశ్వరుడు "ఋషి దంపతులారా! మీకు సంతానయోగం లేదు. అయినా తపస్సుచేసి అర్థించారు కాబట్టి బుద్ధిమంతుడు, వేదవేదాంగవిదుడు అయిన బాలుని ప్రసాదిస్తాను. కాని అతని ఆయువు పదహారు సంవత్సరాలే" అని చెప్పి అంతర్ధాన మయినాడు. కొంత కాలానికి మృకండ మహర్షి భార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను కన్నది. అతడికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు._
_మార్కండేయుడు మహాశివ భక్తుడు. పిల్లవాడికి ఐదవ ఏట అక్షరాభ్యాసం చేశారు. మునీశ్వరులంతా అతణ్ణి దీర్ఘాయువుగా దీవించారు. 'బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరు డన్నాడు. దీర్ఘాయువు కమ్మని మునీశ్వరులు దీవించారు. ఏం జరుగుతుందో? దైవసంకల్పం ఎలా ఉన్నదో?' అనుకున్నాడు మృకండ మహర్షి._
_మార్కండేయుడు ఏకసంథాగ్రాహి. అందుచేత వేదవేదాంగాలన్నీ కొద్దిరోజులలోనే నేర్చుకున్నాడు. అతి చిన్నతనంలోనే మహాపండితుడైనాడు. అతణ్ణి చూసి చుట్టుప్రక్కలున్న మునులు, తల్లితండ్రులు కూడా ఆనందించారు. అయితే పిల్లవాడు మహాపండితుడని ఆనందం ఒక ప్రక్క అల్పాయుష్కుడనే బాధ ఇంకొక ప్రక్క ఈ రకంగా ఆశానిరాశల మధ్యన ఊగిసలాడుతున్నారు తల్లితండ్రులు._
_ఇలా పదిహేను సంవత్సరాలు గడిచినాయి. ఒక రోజు నారద మహర్షి మృకండుని ఆశ్రమానికి వచ్చాడు. నారదునికి అర్ఘ్యపాద్యాదులు అర్పించి సగౌరవంగా ఆహ్వానించాడు మృకండుడు. కుశలప్రశ్నల తరువాత మాటలమధ్యలో మార్కండేయుని చూసి “సాముద్రిక లక్షణాలను బట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు. భక్తశిఖామణి అవుతాడు. లోకైకపూజ్యు డవుతాడు. కానీ అతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్దాయం ఉన్నది. దీనికోసం విచారించాల్సిన పని లేదు. ఈ బాలుడు శివభక్తుడు. శివుడు భక్తసులభుడు. శివుని భక్తితో మెప్పించి వరాలు పొందటం అతితేలిక అయిన పని. ఈ సంవత్సరకాలంలో మార్కండేయుడు శివుని మెప్పించగలడు” అని చెప్పి మార్కండేయునితో, “నాయనా! గోదావరీనదీ తీరములో గౌతముని సిద్ధాశ్రమం ఉన్నది._
_పూర్వకాలంలో అదితికశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది 'సిద్ధజనార్దన క్షేత్రము' అని కూడా పిలువబడుతుంది. అక్కడే రాజేశ్వరి, సోమలింగేశ్వరులు ఉన్నారు. గతంలో శ్వేతకేతువు అనే మహారాజు, శుక్రుడు కూడా పరమేశ్వరుణ్ణి ఈ ప్రదేశంలోనే ఆరాధించారు. కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి శివుని గురించి తపస్సు చెయ్యి" అన్నాడు._
_నారదుని మాటలు విన్న మార్కండేయుడు తల్లితండ్రుల అనుమతి తీసుకుని గౌతమీతీరం చేరాడు. నదిలో స్నానం చేసి, గౌతముడికి నమస్కరించి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఇలా ఒక ఏడాది గడిచి పోయింది. *మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం.* ఆ రోజున అతడికి పదహారు సంవత్సరాలు నిండినాయి. మార్కండేయుని తీసుకు రావటానికి దూతలను పంపాడు యమధర్మరాజు. యమదూతలను చూసి ఈశ్వరుని శరణు కోరాడు మార్కండేయుడు. శివాలయంలోకి వెల్ళి కూర్చున్నాడు. యమదూతలు ఆలయ ప్రవేశం చెయ్యబోయారు. కాలభైరవుడు వారిని అడ్డగించాడు. యమదూతలు తిరిగి వెళ్ళి జరిగిన దంతా యమునికి వివరించారు.మాఘశుద్ధ సప్తమినాడు యముడు మహిషివాహన మెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నదిలో స్నానం చేసి శివునికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు._
_అతణ్ణి ఆలయం నుంచి బయటకు రమ్మని పిలిచాడు యముడు. "పూజ మధ్యలో ఉన్నది. శివపూజకు అంత రాయం కలిగించవద్దు” అన్నాడు మార్కండేయుడు._
_తాను పిలిస్తే ఒక బాలుడు రానన్నాడు. దాంతో యమునికి కోపం వచ్చింది. వెంటనే చేతిలోని పాశం మార్కండేయుని మీదికి విసిరాడు. "ఆర్తత్రాణపరాయణా ! అనాధ రక్షకా! శంకరా ! పాహిమాం ! పాహి పాహి !" అంటూ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు మార్కండేయుడు._
_*రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
[14/05, 22:59] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 2వ భాగం:*_
యముడు విసిరిన పాశం శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుణ్ణి చుట్టేసింది. బాలుడి మీద కోపంతో యముడు పాశాన్ని బలంగా లాగాడు. యమపాశం బాలుడితోపాటు శివలింగాన్ని కూడా కుదిపివేసింది.
వెంటనే ఢమఢమ ధ్వనులతో, ఫెళఫెళారావాలతో, కోటిసూర్యులకాంతితో, ఐదు ముఖాలు, మూడుకనులు కలిగి ఖడ్గము, పరశువు, శూలము ధరించి, గజచర్మాంబరధారి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పరమభక్తితో నమస్కరించాడు మార్కండేయుడు.
"నీకేం భయం లేదు నిశ్చింతగా ఉండు" అని అభయమిచ్చాడు శివుడు. ఆ తరువాత పరమేశ్వరుడు యమధర్మరాజుతో "సమవర్తీ! నువ్వు హద్దు మీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు” అంటా యముని మందలించి మార్కండేయుడికి ఏడు కల్పాల వరకు ఆయుష్షునిచ్చి దీవించాడు. ఈ రకంగా మార్కండేయుడు దీర్ఘాయువైనాడు.
మార్కండేయుడు పరమభక్తుడు, అత్యున్నత సాధకుడు. ఆత్మానుసంధాన ప్రవీణుడు.
మహాభారతంలో శ్రీమన్నారాయణుడు మార్కండేయుడికి సాక్షాత్కరించి, “ఓ మార్కండేయా! నీ బ్రహ్మచర్యము వర్ణించటానికి వీలు లేనిది. నా రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేరు. అటువంటి రూపాన్ని నీకు చూపిస్తున్నాను. నేనే శ్రీమన్నారాయణుడను. ఇంద్రుడు, ప్రజాపతి, కుబేరుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు, యముడు, వీరందరూ నా స్వరూపమే. స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతా నా రూపమే. అని తెలుసుకోవలసినది” అంటూ తన యొక్క విరాడ్రూపాన్ని దర్శింపజేశాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణుని విరాడ్రూపాన్ని దర్శించి తరించిన వాడు మార్కండేయుడు. అతనిచేత చెప్పబడిందే *“మార్కండేయ పురాణము”*.
_*మార్కండేయ పురాణము మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది. అవి :*_
1. 1వ అధ్యాయంనుంచి 7వ అధ్యాయం వరకు జైమిని అడిగిన ప్రశ్నలకు ధర్మ పక్షులు సమాధానం చెబుతాయి.
2. 8 నుంచి 42వ అధ్యాయం వరకు - ప్రాణులయొక్క జన్మ, మృత్యు, ఆవిర్భావ, వికాస, తిరో భావములను గురించి చెప్పబడింది.
3. 43 నుంచి 77వ అధ్యాయం వరకు మార్కండేయుడు తన శిష్యుడైన 'క్రౌష్టికి' అనే వాడికి పురాణం యొక్క మూలవిషయాన్ని వివరిస్తాడు.
4. 78 నుంచి 90 వరకు గల అధ్యాయాలలో దేవీ మాహాత్మ్యము చెప్పబడింది.
5. 91 నుంచి 134వ అధ్యాయం దాకా అంటే మిగిలిన భాగమంతా రాజుల చరిత్ర వర్ణించబడింది.
78వ అధ్యాయంలో దేవీ "సప్తశతి" లేదా దేవీ మాహాత్మ్యము ప్రారంభమవుతుంది. ఇది మొత్తం 700 శ్లోకాలతో ఉన్న మాలామంత్రం.
కష్టాలు కలిగినప్పుడు, గడ్డుపరిస్థితులు ఏర్పడినప్పుడు, 'సప్తశతి' పారాయణ గనక చేసినట్లైతే అవి తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. అని మంత్రశాస్త్రంలో ప్రవేశమున్న వారందరికీ తెలుసు. అలాగే దేవీ నవరాత్రులలో ప్రతి రోజూ సప్తశతి పారాయణ చేసినవారు ఆ పరమేశ్వరి కరుణకు పాత్రులవుతారని కూడా చాలా మందికి తెలుసు...
అయితే సప్తశతి అంటే ఏమిటి? అందులో ఏం చెప్పబడింది? మొదలైన విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుచేత, ఈ విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ముందుగా నా గురుపరంపర విరజానంద, సదానంద, శుకానందనాథులకు నమస్కరించి, ధర్మసంస్థాపన కోసం ఏర్పడ్డ శృంగేరీ, పూరి, ద్వారక, బదరీ, కంచి, పుష్పగిరి, కుర్తాళం పీఠాధిపతులకు వందనాలర్పించి, 'పరమానందనాథ' అనే దీక్షానామం గల హరితస గోత్రీకుడనైన 'క్రోవిపార్ధసారధి' అను నేను దేవీసప్తశతికి పూర్వా పరాలతో, అవసరమైన చోట్ల విశేష వ్యాఖ్య చేస్తూ, భాష్యం వ్రాసి సాక్షాత్తూ పరమేశ్వరీ స్వరూపులైన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారికి అంకితం చేస్తున్నాను. పండితులు పరమేశ్వరి భక్తులు నా యీ సాహసాన్ని మన్నించి నన్ను ఆశీర్వదింతురుగాక !
_*మార్కండేయ ఉవాచ ॥*_
మార్కండేయుడు తన శిష్యుడైన 'క్రౌష్టకి' అనే వాడికి చెబుతున్నాడు.
_*సావర్ణిః సూర్య తనయో యో మనుః కథ్యతే உష్టమః*_
_*నిశామయ తదుత్పత్తిం విస్తరా ద్గదతో మమ ॥*_
ఓ క్రౌష్టకీ ! సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి 8వ మనువైనాడు. అతని యొక్క పుట్టుకను సవిస్తరంగా వివరిస్తాను వినవలసినది.
ఎవరీ సావర్ణి? సూర్యుని భార్యయైన సువర్ణ యందు జన్మించిన వాడు. ఇతడినే 'సూర్యసావర్ణి' అని కూడా అంటారు. ఇతడు 8వ మనువు. మానవులకు ఆదిపురుషుడు మనువు. కాలప్రమాణంలో...
15 తిథులు - ఒక పక్షము.
రెండు పక్షములు - ఒక మాసము.
రెండు మాసములు - ఒక ఋతువు.
మూడు ఋతువులు - ఒక అయనము.
రెండు అయనములు - ఒక సంవత్సరము.
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము.
నాలుగు యుగములు - ఒక మహాయుగము.
71 మహాయుగాలు ఒక - మన్వంతరము.
14 మన్వంతరాలు - ఒక కల్పము. అది బ్రహ్మకు ఒక పగలు.
అంటే ప్రతి కల్పానికీ 14 మంది మనువులు ఉంటారు. ప్రతి మన్వంతరంలోను సప్తఋషులు, ఇంద్రుడు, దేవతలు మొదలైన వారు ఉండి ధర్మాన్ని రక్షిస్తూ... లోకపాలన చేస్తుంటారు.
మన్వంతరము పూర్తి కాగానే వీరందరూ మారిపోతారు. ప్రస్తుతము నడుస్తున్నది శ్వేతనరాహకల్పము._*ఈ కల్పములోని మనువులు వరుసగా:*_
1. స్వాయంభువుడు
2. స్వారోచిషుడు
3. ఉత్తముడు
4. తామసుడు
5. రైవతుడు
6. చాక్షుషుడు
7. వైవస్వతుడు
8. సూర్యసావర్ణి
9. దక్షసావర్ణి
10. బ్రహ్మసావర్ణి
11. ధర్మసావర్ణి
12. రుద్రసావర్ణి
13. రౌచ్చ
14. భౌత్య.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[14/05, 23:00] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 3వ భాగం:*_
వీళ్ళు మొత్తం 14 మంది. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పములోని వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. అంటే ఏడవ మన్వంతరంలో ఉన్నామన్న మాట.
మార్కండేయుడు చెబుతున్నాడు. “ఓ క్రౌష్టకీ ! సూర్యుని యొక్క కుమారుడైన 'సూర్యసావర్ణి'.
_*మహామాయాను భావేన యథామన్వంతరాధిపః |*_
_*స బభూవ మహాభాగః సావర్ణి స్తనయో రవేః ||*_
మహామాయ అయిన ఆ భగవతి యొక్క అనుగ్రహము వలన సకలైశ్వర్యములతో తులతూగుతూ మన్వంతరానికి అధిపతి అయినాడు. ఆ విషయాన్ని చెబుతాను వినవలసినది.
_*స్వారోచిషేஉన్తరే పూర్వం చైత్రవంశ సముద్భవః |*_
_*సురథోనామరాజాஉభూ సమస్తే క్షితి మండలే ॥*_
_*తస్య పాలయతః సమ్యక్ ప్రజా పుత్రాని వౌరసాన్ |*_
_*బభూవుః శత్రవో భూపాః కోలావిధ్వంసి స్తదా ॥*_
పూర్వకాలంలో స్వారోచిష మన్వంతరంలో అంటే రెండవ మన్వంతర మన్నమాట చైత్రవంశంలో పుట్టినటువంటి 'సురధుడు' అనే రాజు ఈ భూమండలాన్ని పాలిస్తున్నాడు. అతడు వేదవేదాంగవిదుడు, ధర్మపరుడు. ప్రజలను కన్న బిడ్డలవలె కాపాడుతున్నాడు. ఆ కాలంలో 'కోలలు' అనబడే ఆదిమజాతివారు ప్రజలను దోచుకుంటూ ఉండేవారు. 'కోలలను' కొంతమంది రాజులు ఎదిరించి సంహరించారు. ఈ రకంగా కోలలను ధ్వంసం చేశారు. కాబట్టి వారికి 'కోలావిధ్వంసులు' అని పేరు వచ్చింది ఆ కోలావిధ్వంసులు సురధుడు అనే ఈ మహారాజుకు శత్రువులైనారు.
_*తస్య తైరభవ ద్యుద్ధ - మతిప్రబలదండినః॥*_
_*న్యూనైరపి సతైర్యుద్ధే - కోలావిధ్వంసిభిర్జితః॥*_
_*తతః స్వపుర మాయాతో - నిజదేశాధిஉపో భవత్ |*_
_*ఆక్రాంత స్స మహాభాగ - సైస్తదా ప్రబలారిభిః ||*_
మహాబలమైనటు వంటి గొప్పగొప్ప ఆయుధములు గలిగి ఎక్కువ సైన్యము గల సురధునికి, తక్కువ సైన్యము గల కోలావిధ్వంసులకు మధ్య గొప్ప యుధ్ధం జరిగింది. అల్పసంఖ్యాకులైనప్పటికీ కోలావిధ్వంసులు యుధ్ధంలో విజయం సాధించారు. సురధుడు ఓడిపోయినాడు. ఆ తరువాత మహారాజు అవమానభారంతో కృంగిపోతూ తన రాజధానికి తిరిగి వచ్చి ఎప్పటిలా రాజ్యపాలన చేయసాగాడు.
ఆ సమయంలో రాజుయొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని, దుష్టులు, దుర్మార్గులు అయిన అతని మంత్రులు కోశాగారాన్ని కొల్లగొట్టారు. రాజుగారి దగ్గర ఉన్న ధనధాన్యసంపదనంతా హరించి వేశారు. ఈ రకంగా సర్వస్వమూ కోల్పోయిన మహారాజు ఏం చెయ్యటానికీ పాలుపోక “వేటకు వెడుతున్నాను" అని చెప్పి ఒంటరిగా బయలుదేరి దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు.
ఆ విధంగా అరణ్యం లోపలికి వెళ్ళి మహారాజు 'మేధసుడు' (ఇతన్నే 'సుమేధుడు' అని కూడా అంటారు) అనే ముని ఆశ్రమం చేరాడు. ఆ ఆశ్రమ ప్రాంగణం ఎలా ఉన్నది అంటే పులులు, సింహాలు మొదలైన క్రూరమృగాలన్నీ సాధువర్తనులై అక్కడ తిరుగుతున్నాయి. వాటితో లేళ్ళు, లేగదూడలు ఆడుకుంటున్నాయి.
కుక్క, పిల్లి కలిసి ఆడుకుంటున్నాయి. 'హింస' అనేది ఎక్కడా కనిపించటం లేదు. ఆశ్రమంలో అనేక మంది శిష్యులు వేదపారాయణ చేస్తున్నారు. ఈ రకంగా ప్రశాంతమైన వాతావరణంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ముని ఆశ్రమాన్ని చూశాడు. మహారాజు చిన్నగా అడుగులు వేసుకుంటూ ఆశ్రమం వైపుకు వెళ్ళాడు. శిష్యుల వల్ల సమాచారమందుకున్న మునీశ్వరుడు బయటకు వచ్చి మహారాజుకు స్వాగత సత్కారాలందించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత, రాజుగారి స్థితి తెలుసుకున్నటువంటి మునీశ్వరుడు ఈయనకు తన ఆశ్రమం లోనే బస ఏర్పాటుచేశాడు. మహారాజు కూడా మునీశ్వరుని మాట కాదన కుండా ఆ ఆశ్రమంలోనే ఉండిపోయాడు.
ఈ రకంగా సుమేధుని ఆశ్రమంలో ఉండి పోయిన మహారాజు ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. కాలం గడిచిపోతోంది. ఉన్నట్టుండి అనుకోకుండా ఒక రోజున రాజుగారికి గతంలో జరిగిపోయిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి.
అతని మనసు చింతాక్రాంతమైంది. ఆలోచనలు పట్టి పీడిస్తున్నాయి. “పూర్వకాలంలో మా తాత ముత్తాతల చేత, నిన్నటి వరకూ నా చేత పాలించబడినట్టి నా సామ్రాజ్యము ఇప్పుడెలా ఉన్నదో కదా? దుర్మార్గులు, దుష్టులు అయిన మంత్రులు ధర్మమార్గాన రాజ్యాన్ని పాలిస్తున్నారో? లేదో? బలపరాక్రమాలతో మదించి ఉన్న నా పట్టపు ఏనుగు శత్రువులచేత చిక్కి ఎటువంటి కష్టాలు పడుతున్నదో? మొన్నటి దాకా నా దగ్గర ఉండి, నన్ను సేవిస్తూ, నా అనుగ్రహము వలన భోగభాగ్యాలు అనుభవించిన వారంతా ఇప్పుడు శత్రురాజులను సేవిస్తూ ఉంటారు.
నేను అనేక కష్టాలు పడి, ధనాన్ని ప్రోగుచేసి, ధనాగారము నింపాను. అదంతా ఇప్పుడు దురాచారుల చేత చిక్కి నష్టమై పోయిఉంటుంది కదా?” అని అనుకుంటున్నాడు.
ఈ రకంగా ఆలోచించిస్తున్న మహారాజు ఆశ్రమ సమీపంలో ఒక వైశ్య ప్రముఖుణ్ణి చూశాడు. అతని దగ్గరకు వెళ్ళి "అయ్యా ! నువ్వెవరవు? ఈ అరణ్యానికి ఎందుకువచ్చావు? బాగా బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. నీ దుఃఖానికి కారణము ఏమిటి?" అన్నాడు. మహారాజు యొక్క స్నేహపూర్వక మైన పలుకులు విన్న వైశ్యుడు వినయపూర్వకంగా శిరసువంచి నమస్కరించి తన కథ చెప్పటం మొదలుపెట్టాడు.
_*“సమాధిర్నామ వైశ్యోహముత్పన్నో ధనినాం కులె”*_ఆర్యా నాపేరు 'సమాధి’. నేను వైశ్యకులంలో అత్యంత ధనికుల ఇంట జన్మించాను అయినప్పటికీ ధనం మీద ఆశ చావలేదు. అందుచేత వ్యాపారం చేసి ఇంకా ధనమార్జించాను. ఆ సమయంలో నా భార్యబిడ్డలకు ధనం మీద ప్రలోభం కలిగింది. దురాశ పుట్టింది. ఆ కారణం చేత వారు దుర్మార్గులు, దుష్టులు అయినారు.
నేను కట్టుకున్న భార్య, కన్నబిడ్డలే నా ధనాన్ని అపహరించి నన్ను ఇంటి నుంచి తరిమి వేశారు. ఈ రకంగా భార్యా పుత్రులను, ధనాన్ని పోగొట్టుకుని, బంధుమిత్రులను వదలి, చేసేది లేక, ఈ అడవికి వచ్చాను. కొంత కాలంగా ఈ అరణ్యంలోనే ఉంటున్నాను. అందుచేత నా భార్యబిడ్డల యొక్క, బంధువుల యొక్క, క్షేమసమాచారాలేవీ తెలియటం లేదు. ఇంటి దగ్గర వారంతా క్షేమంగా ఉన్నారో లేదో? అసలు....
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
_*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 4వ భాగం:*_
ఇప్పుడు వారెలా ఉన్నారో? నా కుమారులంతా సన్మార్గంలోనే సంచరిస్తున్నారో లేదో?” అంటూ మనసులోని బాధనంతా బైటపెట్టాడు వైశ్యుడు. అతడి మాటలు విన్న మహారాజు.
_*యై ర్నిరక్తా భవాం ల్లుభైః - పుత్రదారాదిభి ర్ధనైః |*_
_*తేషు కిం భవత స్నేహ - మనుబధ్నాతి మానసమ్॥*_
"మిత్రమా ! సమాధీ ! నీ భార్యాబిడ్డలే దురాశతో నీ ధనాన్నంతా అపహరించారు. చివరకు నిన్ను ఇంటి నుంచి కూడా వెళ్ళగొట్టారు. అటువంటి వారి యందు నీకు మమకారము ఎందుకు కలుగుతున్నదో నాకు తెలియటం లేదయ్యా” అన్నాడు రాజు.
రాజుగారి మాటలు విన్న వైశ్యుడు
"రాజా ! ఇప్పుడు మీరన్నట్లే నేనుకూడా అనుకున్నాను. కాని ఏం చెయ్యగలను? నా మనసు నాకు సహకరించటం లేదు. వాళ్ళ మీద కోపం రావటం లేదు. ధనం మీద వ్యామోహంతో కన్న తండ్రినైన నన్ను వెళ్ళగొట్టారు. బంధువులపట్ల దురుసుగా ప్రవర్తించారు. నా భార్యకూడా ఈ దుర్మార్గులంటేనే ప్రేమగా ఉన్నది.
అటువంటి వారిపట్ల నాకు కోపం రావటం లేదు. వారి యందు నా మనసు కఠినంగా వ్యవహరించటం లేదు. అసలు నాకేమీ తెలియటం లేదు. ఏది తప్పో, ఏది ఒప్పో కూడా తెలుసుకోలేకపోతున్నాను. రాజా! బంధువులు దుర్మార్గులైనప్పటికీ మనసులో వాళ్ళ మీద ప్రేమ, అభిమానము ఉన్నాయి. ఇదేమి విచిత్రమయ్యా! వాళ్ళ కోసం నేను బాధపడుతున్నాను. ఈ స్థితిలో నేను ఏం చెయ్యాలి?” అన్నాడు.
వైశ్యుడు చెప్పిన విషయమంతా విన్నాడు మహారాజు. బాగా ఆలోచించాడు. ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదతనికి. అప్పుడు వారిద్దరూ(మహారాజు, వైశ్యుడు) కలిసి మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి మహర్షితో “ ఓ మహర్షీ! ఒక చిన్న అనుమానం నన్ను పట్టి పీడిస్తున్నది. దయచేసి ఆ అనుమానాన్ని నివృత్తి చెయ్యవలసింది. ఓ ఋషి పుంగవా! నేను యుద్ధంలో ఓడిపోయాను. అవమానం పొందాను. నా మంత్రులు సైనికాధికారులు కూడా నన్ను మోసగించి, నా ధనాగారాన్ని కొల్లగొట్టారు. ఏమీచెయ్యలేని పరిస్థితిలో రాజ్యాన్ని వదిలి ఒంటరిగా వచ్చేశాను.
ఈ విషయాలన్నీ నాకు తెలుసు. నేను వాటిని మరిచి పోలేదు. అయినప్పటికీ నా మనస్సు రాజ్య విశేషాల మీదనే లగ్నమవుతున్నది. వాటి మీద మమకారం మాత్రం తగ్గటం లేదు. ఓ మునీశ్వరా! నేనే కాదు. ఇతడు సమాధి అనే పేరుగల వైశ్యుడు. అతి ధనవంతుడు. ఇతని భార్యాబిడ్డలే ధనం మీది మమకారంతో ఇతణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఆస్తిపాస్తులన్నీ దోచుకున్నారు. ఇతడు అరణ్యాలపాలయినాడు. ఈ రకంగా భార్యాబిడ్డలచేత గెంటివేయబడినప్పటికీ, అరణ్యాల పాలయినప్పటికీ, వారిపట్ల అత్యంతమైన ప్రేమానురాగాలను కలిగి ఉన్నాడు. ఇలా వైశ్యుడుగాని, నేనుగాని జరిగిన మోసాలు, ఘోరాలు తెలిసికూడా ఆ విషయాలయందు మమకారాన్ని వదలలేక అత్యంతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
అన్ని విషయాలు తెలిసి కూడా మేము ఈ మోహంలో పడిపోతున్నాము. ఈ మోహము మా వివేకాన్ని పోగొట్టి మమ్మల్ని మూఢులుగా, అజ్ఞానులుగా చేస్తున్నది. ఇదంతా దేనివల్ల జరుగుతున్నదో, దీనికారణం ఏమిటో, మాకు వివరించవలసింది” అన్నాడు. ఆ మాటలు విన్న మహర్షి...
జ్ఞాన మస్తి సమస్తస్య - జంతో ర్విషయగోచరే॥
విషయశ్చ మహాభాగ - యాతిచైవం పృథక్పృథక్||
దివాంధాః ప్రాణినః కేచి - ద్రాత్రావంధా స్తథాపరే।
కేచి ద్దివా తథా రాత్రే - ప్రాణిన స్తులదృష్టయః ॥
జ్ఞానినో మనుజా స్సత్యం కిం నుతే న హి కేవలమ్ |
యతో హి జ్ఞానిన స్సర్వే - పశుపక్షిమృగాదయః ||
జ్ఞానం చ త స్మనుష్యాణాం - యత్తేషాం మృగపక్షిణామ్|
మనుష్యాణాం చ యత్తేషాం - తుల్య మన్యత్తథోభయోః||
జ్ఞానేஉ పి సతి పశ్యైతాన్ పతంగాం ఞ్ఛవచుంచుషు |
కణమోక్షాదృతా న్మోహా - త్పీడ్యమానా నపి క్షుధా ॥
మానుషా మనుజవ్యాఘ్ర - సాభిలాషా స్సుతాన్ ప్రతి |
లోభా త్ప్రత్యుపకారాయ - నన్వేతాన్ కిం న పశ్యసి ॥
తథాపి మమతావర్తే - మోహగర్తే నిపాతితాః |
మహామాయాప్రభావేణ - సంసారస్థితి కారిణా ॥
తన్నాత్ర విస్మయః కార్యో - యోగనిద్రా జగత్పతేః |
మహామాయా హరేశ్చైత - త్తయా సంమోహ్యతే జగత్ ||
జ్ఞానినామపి చేతాంసి - దేవీ భగవతీ హి సా |
బలా దాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥
తయా విసృజ్యతే విశ్వం జగదేత చ్చరాచరమ్ |
సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే ॥
సా విద్యా పరమా ముక్తే - ర్హేతుభూతా సనాతనీ |
సంసారబంధహేతుశ్చ - సైవ సర్వేశ్వరేశ్వరీ ॥
రాజా! ఇంద్రియ గోచరమైనటువంటి జ్ఞానము సమస్త జంతువులకు సమానంగానే ఉంటుంది. ఆహార నిద్రా మైధునాలు ప్రాణులన్నింటికీ సమానం గానే ఉంటాయి. దీనిలో ఏ రకమైన తేడా లేదు. కొన్ని ప్రాణులు పగలు చూడగలవు. ఉదా|॥కు మనుష్యుడు, కాకులు, చిలకలు, పిచ్చుకలు, పావురాలు మొదలైనవన్నీ పగలు మాత్రమే చూడగలుగుతాయి. మరికొన్ని జీవులు గుడ్లగూబలలాటివి రాత్రులందు మాత్రమే చూడగలుగుతాయి. అయితే మరికొన్ని ప్రాణులు కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు మొదలైనవి పగలు, రాత్రికూడా చూడగలుగుతాయి. మానవులకు జ్ఞానమున్నది అనే మాట నిజమే అయితే ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానము పశువులకు, పక్షులకు మృగాలకు చివరికి క్రిమికీటకాలకు కూడా ఉన్నదయ్యా! ఈ రకంగా విషయగోచరమైన జ్ఞానము పశుపక్ష్యాదులకు ఉన్నట్లే మానవులకు కూడా ఉన్నది.అందుచేతనే ఈ రకమైన జ్ఞానము మానవులకు, ఇతర ప్రాణులకు కూడా సమంగా ఉన్నది అంటున్నాము.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[14/05, 07:31] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 5వ భాగం:*_
అదిగో ఆ పక్షుల వంక ఒక్కసారి చూడు. వాటికి జ్ఞానం లేదా? ఆకలివేస్తే తినాలి అని తెలియదా? తల్లిపక్షి తాను ఆకలితో మాడిపోతూ కూడా దొరికిన ఆహారం తను తినకుండా తన పిల్లలకు ఎలా నోట్లో పెడుతున్నదో చూడు. రాజా! దీన్నే 'మోహము' అంటారు.
ఇక మానవుల సంగతి చూడు. బిడ్డలవల్ల ప్రత్యుపకారము ఉన్నది అనే భావంతోనే వారియందు అభిలాషను కలిగి ఉన్నారు. ఈ పిల్లలు పెరిగి పెద్దవారయి తమ పేరుని నిలబెడతారనో, వంశగౌరవాన్ని కాపాడతారనో ఆశ ఉంటుంది. దాంతోనే పిల్లల మీద అంతమక్కువ కలిగివుంటారు. ఈ విషయం నీకు మాత్రం తెలియదా? సృష్టిస్థితి లయాలకు కారణమైనది మహామాయ. ఆవిడే పరమేశ్వరి.
ఆమె యొక్క ప్రభావం చేతనే మానవులు 'మాయ' అనే సుడిగుండంలో పడిపోతున్నారు. ఈ సూయ అనేది పరమేశ్వరి యొక్క అధీనంలో ఉంటుంది. పాము కోరలలో విషమున్నట్లుగానే మాయ పరమేశ్వరికి లోబడి ఉంటుంది. తన కోరలలో ఉన్న విషం వల్ల పాముకు ఏరకమైన ప్రమాదము కలగదు. కాని పాముకాటుతిన్న వారికి మాత్రం ఆ విషం హానిచేస్తుంది. అలాగే పరమేశ్వరిని ఆవరించి ఉన్న మాయ మానవులను సంసార లంపటంలో పడవేస్తుంది. ఈ మాయ అనేది విష్ణువు యొక్క యోగనిద్ర. ఆ మాయచేతనే జగత్తంతో సమ్మోహిత మవుతున్నది. మహామాయ జ్ఞానులయొక్క మనస్సులను కూడా ఆకర్షించి వారిని మోహగ్రస్తులను చేస్తుంది.
పూర్వకాలంలో నారదుడు స్త్రీగా మారిపోయినది, విశ్వామిత్రు డంతటి తపస్సంపన్నుడు మేనకను వివాహం చేసుకున్నది ఈ మాయ వల్లనేనయ్యా. ఈ జగత్తునంతటినీ ఆవిడే సృష్టిస్తున్నది. ఆవిడే లయం చేస్తున్నది. ఆమె అనుగ్రహంచేతనే మనం ముక్తి పొందగలుగుతాము. ఆ దేవియే పరావిద్య. ఆమెయే ముక్తికి కారణభూతురాలు. ఈ జగత్తును పాలించే శక్తి. సంసారబంధనాలకు హేతువుకుడా ఆమే, ఆ దేవియే పరమేశ్వరి” అన్నాడు.
మహర్షి మాటలు విన్న మహారాజు “మహర్షీ! -మహామాయ అంటున్నావు. పరమేశ్వరి అంటున్నావు. ఇంతకీ ఆవిడ ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? ఏం చేస్తుంది? ఆమె స్వరూపస్వభావాలను పూర్తింగా వివరించవలసింది" అని ప్రార్థించాడు.
మహారాజు యొక్క ప్రార్థన మన్నించిన వాడైన మహర్షి ఈ రకంగా చెబుతున్నాడు.
రాజా! ఆ పరమేశ్వరియే నిత్యమైనది, సత్యమైనది. ఆమెయే శాశ్వత మైనది. ఆమెయే ఈ జగత్తుగా మూర్తీభవించింది. అనగా ఈ జగత్తంతా ఆమే వ్యాపించి ఉన్నది. ఆ జగన్మాత అనేక రకాలుగా ఆవిర్భవిస్తుంటుంది. ఎందుకు? అంటే...
_*దేవానాం కార్యసిద్ధ్యర్థ - మావిర్భవతి సా యదా ॥*_
_*ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యా உష్యభిధీయతే ॥*_
ఆ పరమేశ్వరి నిత్యమైనది. అంటే సర్వకాలసర్వావస్థల యందు ఉండునది. అయినప్పటికీ దేవతల కార్యములు సాధించటం కోసం ఆవిడ ఈ లోకంలో ఆవిర్భవిస్తూ ఉంటుంది.
లలితాసహస్రనామాలలో '5'వ నామం చూడండి 'దేవకార్య సముద్యతా' దేవతల కార్యములు పూర్తిచెయ్యటం కోసం భూలోకంలో అవతరిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ పరమేశ్వరి ఎప్పుడు అవతరిస్తుంది? అంటే భగవానుడు గీతలో చెబుతున్నాడు...
_*యదాయదాహి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత |*_
_*అభ్యుత్థానమధర్మస్యతదాత్మానం స్యజాஉஉమ్యహం ॥*_
లోకంలో తన అవసరం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు పరమేశ్వరి భూమి మీద అవతరిస్తుంది. ఏమిటా అవసరం? అసలు ఆవిడతో పనేమిటి మనకి?
_*పరిత్రాణాయసాధూనాం వినాశాయచదుష్కృతాం ।*_
_*ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥*_
దుష్టశిక్షణ, శిష్టరక్షణ. ఇది భగవంతుడి కర్తవ్యం. కాబట్టి లోకంలో ధర్మానికి ఎప్పుడైతే హానికలిగిందో, హాని కలగటం అంటే ధర్మం నిలబడ లేకపోవటం. ఎప్పుడైతే ధర్మం నాశనమై పోతోందో అప్పుడు ఆ పరమేశ్వరి భూలోకంలో అవతరిస్తుంది. అదేమాట చెబుతున్నాడు మహర్షి రాజుతో...
రాజా ! ఒకసారి ప్రళయం సంభవించిది. ప్రళయం అంటే ఈ సృష్టి అంతా నాశనం అయిపోవటం. ప్రళయమనేది రెండు రకాలుగా ఉంటుంది.
_*1. మహా ప్రళయము.*_
_*2. పాక్షిక ప్రళయము.*_
కల్పాంతాన మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు జగత్తులోని జీవరాశి అంతా నశించిపోతుంది. ఈ జగత్తంతా ఏరకంగా సృష్టించబడిందో అదే క్రమంలో క్రిందినుంచి పైకి వెళ్ళి పరమేశ్వరునిలో లీనమయిపోతుంది. అసలు జగత్తు ఏ రకంగా సృష్టించబడింది?
నిరాకారుడు, నిర్గుణస్వరూపుడు పరబ్రహ్మ. అతడు బిందురూపంలో ఉన్నాడు. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వస్తుంది. ఆ పరబ్రహ్మ బిందురూపంలోనే ఎందుకున్నాడు? త్రికోణము, అష్టకోణము, చతురస్రము, దీర్ఘచతురస్రము ఇలా ఏదైనా ఆకారంలో ఉండచ్చుగదా? దీనికి సమాధానం ఏమిటంటే మనకంటికి కనిపించే - జగత్తు అంటే - భూమి ఇది గుండ్రంగా ఉన్నది. పరమేశ్వరుడు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పటానికి వీలుగా అతడు గుండ్రంగా బిందువులాగా లేకుండా ఇంకేదైనా రూపంలో అంటే త్రికోణము, అష్టకోణము రూపంలో గనక ఉన్నట్లతే 'జగత్తంతా వ్యాపించటం' అనేది జరగదు.అందుచేతనే పరమేశ్వరుడు బిందురూపుడు అని చెప్పటం జరుగుతోంది. బిందువు ఎంత చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు. *'అణోరణీయాం। మహతోమ హీయాం'* అంటోంది కఠోపనిషత్తు. అంటే - పరమేశ్వరస్వరూపమనేది అణువుకన్నా చిన్నదైనది. పెద్దవాటన్నింటి లోకీ అతిపెద్దదైనది. ఇలా సంకోచించటము, పూర్తిగా వ్యాకోచించి జగత్తంతా ఆక్రమించటమనేది ఒక్క పరమేశ్వరుడికే సాధ్యం. అందుకే అతడు బిందురూపుడు.
ఈ రకంగా బిందురూపంలో ఉన్న పరబ్రహ్మ మళ్ళీ సృష్టిచెయ్యాలని సంకల్పించాడు. ఎందుకు సంకల్పించాడు? తన లీలావినోదం కోసం మాత్రం కాదు. మరి ఇంకెందుకు? గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయం కాకుండా తనలో కలిసిపోయిన జీవరాశికి వాటి కర్మానుసారం పునర్జన్మనిచ్చి, వాటి కర్మనుక్షయం చేసి, తద్వారా ఆ జీవులకు మోక్షం కలిగించాలనే కోరికతో మాత్రమే సృష్టిచెయ్యాలని సంకల్పించాడు. ఇలా సంకల్పించిన పరమేశ్వరుడు మొదటగా తనను తాను రెండు భాగాలుగా విభజించు కొన్నాడు. అంటే...
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 6వ భాగం:*_
పరమేశ్వర స్వరూపమైన బిందువు నుంచి కొంతశక్తి బయటకు వచ్చింది. అదే త్రికోణము. మహాయోని. దాని నుంచే ఈ జగత్తంతా ఆవిర్భవించింది.
అనగా అవ్యక్తమైనవాడు పరమేశ్వరుడు. అతన్నుంచి వ్యక్తమైనశక్తి అదే త్రికోణం వచ్చింది. దాన్నుంచి అహంకారము వచ్చింది. దీని నుంచి నామ రూపాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది. ముందుగా రూపాత్మక జగత్తు. దీనిలో ముందు వచ్చినవి తన్మాత్రలు. అవే శబ్ద స్పర్శరూపరసగంథాలు. వీటి నుంచి పంచభూతాలు వచ్చినాయి. వాటిలో మొదటగా వచ్చింది. ఆకాశం ఇక
*ఆకాశాద్ - వాయు :* ఆకాశం నుంచి వాయువు వచ్చింది.
*వాయోరగ్ని :* వాయువు నుంచి అగ్ని ఉద్భవించింది.
*అగ్నిర్ఆప :* అగ్నినుంచి జలము ఉద్భవించింది.
*ఆపః పృధ్వి :* జలము నుంచి భూమి ఉద్భవించింది.
ఇప్పుడు కర్మ పరిపక్వం కాని జీవి మేఘాన్ని ఆశ్రయించి వర్షపు జల్లుగా భూమి మీద పడి ఏదో విత్తనంలో ప్రవేశిస్తుంది. ఆ విత్తనం మొలకెత్తి ఫలించి జీవుల గర్భం చేరుతుంది. ఈ రకంగా జీవరాశి అంటే రూపాత్మకమైన జగత్తు సృష్టించబడుతుంది. ఇక నామాత్మకమైన జగత్తు. ముందుగా పరబ్రహ్మ. అదే నామంలో చెప్పాలంటే ఓంకారము. ఓంకారము నుంచి అ నుంచి క్ష వరకు ఉన్న అక్షరసమామ్నాయము వచ్చింది. అక్షరాల నుంచి పదాలు, పదాలనుంచి వాక్యాలు, మంత్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతము, సాహిత్యము, సర్వశాస్త్రాలు వచ్చినాయి. ఇది నామాత్మకమైన జగత్తు ప్రళయం సంభవించినప్పుడు అన్ని జీవుల యొక్క కర్మా క్షయంకాదు. కర్మక్షయం అయిన జీవులు పరబ్రహ్మలో లీనమై పోతాయి. కర్మక్షయంకాని జీవులు తమ కర్మను తమతోపాటు మూటకట్టుకుని మాయలో కలిసిపోతాయి. ఇప్పుడు పంచభూతాలు కూడా నశించి పోతాయి. ముందుగా భూమి నీటిలో కలిసిపోతుంది. నీరు - అగ్నిలో, అగ్ని - వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మాయలో కలిసి పోతుంది. ఈ రకంగా అన్నింటినీ తనలో కలుపుకున్న మాయ పరమేశ్వరు నిలో లీనమైపోతుంది.
ప్రళయం సంభవించినప్పుడు నామాత్మకమైన జగత్తు కూడా లయమై పోతుంది. సంగీతము, సాహిత్యము, శాస్త్రాలు అన్నీ వేదాలలో కలిసిపోతాయి. వేదాలు అకార ఉకార మకారములలో కలిసిపోతాయి. మూడూ అంటే ఆకార ఉకార మకారాలు ఓంకారంలో లీనమైపోతాయి. ఓంకారమే పరబ్రహ్మ.
ఈ రకంగా జగత్తంతా పరమేశ్వరునిలో లీనమై పోవటాన్నే 'మహాప్రళయము' అంటారు. ఇది పూర్తి ప్రళయము. ఆ సమయంలో జగత్తంతా శూన్యంగా ఉంటుంది.
ఇక రెండవది పాక్షిక ప్రళయము. ఇది ప్రతిమహాయుగాంతంలోను జరుగుతుంది. అప్పుడు జగత్తంతా జలమయమై పోతుంది. ఆ సమయంలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు శేషశాయియై ఉంటాడు. ఇది ప్రళయానికి సంబంధించిన విషయం.
మహర్షి రాజుగారికి చెబుతున్నాడు. “రాజా! ఒకసారి ప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు శేషశాయియై యోగనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క చెవిలో నుంచి వచ్చిన మలినపదార్థం 'గుబిలి' నుంచి మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. జీవులు స్త్రీ పురుషుల కలయిక వల్ల ఉత్పన్న మవుతాయి కదా! మరి ఇలా మలిన పదార్థాల నుంచి పుట్టటం ఏమిటి? ఇది సంభవమేనా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒక్కసారి ఛాందోగ్యో పనిషత్తును చూడాలి.
అందులో ఉద్దాలకమహర్షి తన కుమారుడైన 'శ్వేతకేతువుకు తత్త్వాన్ని బోధిస్తూ “నాయనా శ్వేతకేతూ! స్థావర జంగమాత్మక మైన జీవులన్నీ పుట్టుక రీత్యా అనేక విధాలుగా ఉన్నాయి. అవి.
1. అండజములు - గ్రుడ్డునుంచి పుట్టేవి. (పక్షులు, పాములు)
2. జారజములు - స్త్రీ యొక్క జననాంగము నుంచి పుట్టేవి (మనుష్యులు, పశువులు.)
3. ఉద్భిజములు - విత్తనాలవల్ల భూమి నుంచి పుట్టేవి. (చెట్లు చేమలు)
4. స్వేదజనులు - చెమట లేదా మలిన పదార్థాలవల్ల పుట్టేవి.
5. ఊష్మజములు - వెచ్చదనం వల్ల పుట్టేవి. (క్రిమికీటకాలు)
ఈ రకంగా విష్ణువు యొక్క చెవి గుబిలి నుంచి జన్మించిన మధుకైటభులు చుట్టూ చూశారు. అంతా సముద్రం. ఎంతో దూరం వెళ్ళారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఇంత నీరు ఇక్కడ ఎలా నిలిచింది? అసలు మనం ఎలా పుట్టాము? అని ఆలోచించ సాగారు. ఆ సమయంలో వారికి వాగ్బీజం వినిపించింది. దాన్నే మహామంత్రంగా స్వీకరించి నిరాహారులై తపస్సు చేశారు.
తపస్సు అంటే మనసావాచా కర్మణా ఒకే విషయాన్ని గురించి సర్వకాల సర్వావస్థలయందు ఆలోచించటమన్నమాట. ఇలా వేయి సంవత్సరాలు గడిచింది. వారి దీక్షకుమెచ్చి పరమేశ్వరి ప్రత్యక్షమై “ఏ వరం కావాలో కోరుకోండి" అన్నది. వెంటనే వారు 'స్వచ్ఛంద మరణం కావాలి' అన్నారు. 'తథాస్తు' అన్నది పరమేశ్వరి.
వారు ఆ నీటిలో తిరుగుతూ ఒకరోజున పద్మాసనుని చూశారు అతడే బ్రహ్మదేవుడు. కర్మబ్రహ్మ. అతడు చతుర్ముఖుడు. తన నాలుగు ముఖాలతోను వేదపారాయణ చేస్తున్నాడు. ఆయనను చూసిన మధుకైటభులు 'మాతో యుద్ధానికి రా!' అన్నారు. బ్రహ్మ సమాధానం చెప్పలేదు. దాంతో రాక్షసులకు కోపం వచ్చి 'మాతో యుద్ధం చేస్తావా? లేక మాచేతిలో చస్తావా? ఏదో ఒకటి త్వరగా తేల్చుకో' అన్నారు. అప్పటికీ బ్రహ్మ మాట్లాడలేదు. రాక్షసులు మీదిమీదికి రాసాగారు. పైకి ఎగురుతున్నారు. భయపడ్డాడు బ్రహ్మ.పద్మాసనాన్ని వదలి, దాని కాడగుండాక్రిందికి దిగాడు. అక్కడ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నాడు. తనను రక్షించవలసినదిగా తండ్రిని వేడుకున్నాడు.
విష్ణువు ఉలకలేదు పలకలేదు. బ్రహ్మ రోదన అంతా అరణ్యరోదన అయింది. విష్ణువు లేస్తే రాక్షసులను సంహరిస్తాడు. కాని నిద్రలో ఉన్నాడు. అది మామూలు నిద్రకాదు. యోగనిద్ర. అంటే విష్ణువు మాయచేత ఆవరించబడి ఉన్నాడు. ఆయన నిద్రలేవాలంటే మహామాయ కరుణించి ఆయన్ను వదలాలి. ఆ పరాశక్తి రూపమే మాయ. అందుకని బ్రహ్మ సర్వ లోకపాలకురాలు, జగజ్జనని అయిన పరమేశ్వరిని పరిపరి విధాల స్తుతించాడు.
సప్తశతిలోని ప్రథమాధ్యాయంలో బ్రహ్మ పరమేశ్వరిని చేసిన స్తుతి ఉత్తమోత్తమమైనది. ఇది మొత్తం 72-87 (16) శ్లోకాలుగల స్తోత్రం. దీన్ని గనక పారాయణ చేసినట్లైతే మొదటి అధ్యాయం మొత్తం పారాయణ చేసిన ఫలితం వస్తుంది.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[16/05, 07:59] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 7వ భాగం:*_
_*👉 బ్రహ్మ పరమేశ్వరిని చేసిన స్తోత్రం:*_
త్వం స్వాహా త్వం స్వధా త్వం హి - వషట్కారఃస్వరాత్మికా ।
సుధా త్వ మక్షరే నిత్యే - త్రిధా మాత్రాత్మికా స్థితా ||
అర్ధమాత్రాస్థితా నిత్యా - యాஉనుచ్చార్యా విశేషతః ।
త్వమేవ సంధ్యా సావిత్రీ - త్వం వేదజననీ పరా ॥
త్వయైత ద్ధార్యతే విశ్వం - త్వయైత త్సృజ్యతే జగత్ |
త్వయైత త్పాల్యతేదేవి - త్వ మత్స్యంతే చ సర్వదా ॥
విసృష్టా సృష్టిరూపా త్వం - స్థితిరూపా చ పాలనే ।
తథా సంహృతిరూపాஉoతే - జగతోஉస్య జగన్మయే ॥
మహావిద్యా మహామాయా - మహామేధా మహాస్మృతిః ।
మహామోహా చ భవతీ - మహాదేవీ మహాసురీ ॥
ప్రకృతి స్త్వం హి సర్వస్య - గుణత్రయవిభావినీ ।
కాలరాత్రి ర్మహారాత్రి - ర్మోహరాత్రిశ్చ దారుణా ॥
త్వం శ్రీ స్వ మీశ్వరీ త్వం హ్రీ - స్త్వం బుద్ధిర్బోధలక్షణా |
లజ్జా పుష్టి స్తథా తుష్టి - స్త్వం శాంతిః క్షాంతిరేవ చ ॥
ఖడ్గనీ శూలినీ ఘోర - గదినీ చక్రిణీ తథా ।
శంఖినీ చాపినీ బాణ - భుశండీపరిఘాయుధా ॥
సౌమ్యా సౌమ్యతరాశేష - సౌమ్యేభ్యస్త్వతిసుందరీ |
పరాపరాణం పరమా త్వమేవ పరమేశ్వరీ ॥
యచ్చ కించి త్క్వచిద్వస్తు - సదసద్వా ఖిలాత్మికే ।
తస్య సర్వస్య యా శక్తి - స్సాత్వం కిం స్తూయసే మయా॥
యయా త్వయా జగత్ర్సష్టా - జగత్పా త్యత్తి యో జగత్ |
సోஉపి నిద్రావశం నీతః క స్త్వాం స్తోతు మిహేశ్వరః ॥
విష్ణుః శరీరగ్రహణ - మహ మీశాన ఏవ చ |
కారితాస్తే యతోஉ తస్త్వాం -కః స్తోతుం శక్తిమా న్భవేత్ ॥
సా త్వ మిత్థంప్రభావైః స్వై - రుదారైర్దేవి సంస్తుతా ।
మోహాయైతౌ దురాధర్షా - వసురౌ మధుకైటభౌ ॥
ప్రబోధం చ జగత్స్వామీ - నీయతా మచ్యుతో లఘు ।
బోధశ్చ క్రియతా మస్య హంతు మేతౌ మహాసురౌ ॥
ఓ జగజ్జననీ! త్వం స్వాహా! నీవే స్వాహాకారానివి. దేవతల ప్రీతికోసం యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు. వాటిలో దేవతలకు ఆహుతులు అర్పించే టప్పుడు చెప్పేది 'స్వాహా' మంత్రము. ఇంద్రాయస్వాహా! ఇంద్రాయ ఇదంనమమ. అగ్నయేస్వాహా! అగ్నాయ ఇదంనమమ.
బ్రహ్మదేవుడు లోకాలన్నీ సృష్టించిన తరువాత, దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి, విధాతా! ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉన్నాము. దీనికి ఏదైనా ఉపాయం చెప్పవలసింది అన్నారు. దానికి బ్రహ్మ 'ఇలాంటి విషయాలు చూట్టానికి విష్ణువు ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళండి' అన్నాడు. దేవతలంతా విష్ణువు దగ్గరకు వెళ్ళి తమ గోడు వినిపించారు. వారి మాటలు విన్న విష్ణువు "దేవతలారా!
భూలోకంలో బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞయాగాదులకు సంబంధించిన హవ్యము మీ ఆకలిని పోగొడుతుంది. ఆ హవ్యము మీపేరు చెప్పి అగ్నిలో వేస్తారు. దాన్ని అగ్ని మూలంగా మీకు అందించే శక్తి వేరే ఉన్నది. ఆ శక్తి కోసం మీరంతా పరమేశ్వరిని ఆరాధించండి. ఆవిడ ప్రసన్నురాలై ఆ శక్తిని పంపుతుంది" అన్నాడు.
దేవతలంతా పరమేశ్వరిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆరాధించారు. పరమేశ్వరి వారి దీక్షకు మెచ్చి ఆ శక్తిని పంపించింది. బ్రహ్మ ఆ శక్తికి నమస్కరించి “తల్లీ ! నువ్వు అగ్నికి వాహకశక్తివై, అతని యందు హోమంన్చేసిన హవ్యాన్ని దేవతలకు అందించు" అన్నాడు.
దానికి ఆ శక్తి “నేను శ్రీహరిని తప్ప పరపురుషునికి చెందను. అగ్నికి వాహక శక్తిగా ఉండను" అని చెప్పి తపస్సు చేసుకోవటం కోసం వెళ్ళిపోయింది.
కొంతకాలానికి శ్రీహరి ఆమెకు ప్రత్యక్షమై “దేవీ! నీ మనసు నా కర్థమయింది. మరుజన్మలో నగ్నజిత్తు అనే రాజు కుమార్తె నాగ్నజితిగా జన్మించి నా అంశతో పుట్టిన శ్రీకృష్ణుని వివాహమాడతావు. కాని ఇప్పుడు మాత్రం స్వాహా అనే పేరుతో అగ్నిదేవునికి ఇల్లాలివై అతనికి వాహకశక్తిగా ఉండు" అన్నాడు. తరువాత అగ్నిదేవుడికీ, స్వాహాదేవికీ వివాహం జరిగింది. ఈ రకంగా పరమేశ్వరి అంశ అయిన స్వాహాదేవి ద్వారానే అగ్నిలో సమర్పించిన ఆహుతులు దేవతలకు చేరతాయి.
త్వం స్వధా ! నీవే స్వధా మంత్రానివి. పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు చెప్పే మంత్రము 'స్వధా' తర్పణ చేసేటప్పుడు 'స్వధాం తర్ప యామి' అంటారు.
పితృదేవతలకు శ్రాద్ధకర్మలో తర్పణము ద్వారా ఆహారం లభించేట్టు చేశాడు బ్రహ్మ. కాని అది వారికి సక్రమంగా చేరటంలేదు. పితృదేవతలంతా బ్రహ్మ దగ్గరకుపోయి వారి బాధలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మ పరమేశ్వరిని ప్రార్థించి ఆమె అంశతో ఒక కన్యను సృష్టించాడు. ఆమె పేరు 'స్వధ'. అపురూప సౌందర్యరాశి. ఆమెను పితృదేవతలకు సమర్పించాడు. శ్రాద్ధకర్మలో పితృదేవతలకు సమర్పించిన వాటిని వారికి సవ్యంగా అందించటమే ఆమె పని. ఈమె కూడా పరమేశ్వరి అంశయే.
నీవే వవట్కారము అంటే 'వేదయజ్ఞము' అని అర్థం. ఓ దేవీ! అన్ని మంత్రాలకు మూలమైనటువంటి దానవు నీవే. నీవే సుధవు. అంటే దేవతలకు ఆహారమైన అమృత స్వరూపిణివి. క్షరము అనగా నాశనము లేని దానివి. శాశ్వతమైనదానివి. నిత్యము, సత్యము అయిన దానివి. ఓ తల్లీ ! నీవే త్రిమాత్రాత్మికవు. అకార ఉకార మకారాలు మూడింటినీ మూడు మాత్రలు అంటారు. ఈ మూడింటి కలయికయే ఓంకారము. అందుకే పరమేశ్వరి ఓంకార స్వరూపిణి అంటున్నాడు. పూర్తిగా ఉచ్చరించటానికి వీలుకాని నిత్యాస్వరూపమైన అర్ధమాత్రవు నీవే. అర్ధమాత్ర అంటే..._*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[17/05, 07:42] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 8వ భాగం:*_
ఓం కారము ఉచ్చరించిన తరువాత అది లయమయ్యేటప్పుడు వచ్చే సూక్ష్మ శబ్దాన్ని అర్థమాత్ర అని 'నాదము' అని అంటారు. ఓం... మ్ ... నీ వే గాయత్రివి నీవే సావిత్రివి నీవే దేవతలకు జన్మనిచ్చిన దానివి.
ఓ తల్లీ ! ఈ జగత్తునంతా నీవే సృష్టిస్తున్నావు. పోషిస్తున్నావు. చివరకు దాన్ని నీవే లయం చేస్తున్నావు. అమ్మా ! సృష్టికాలంలో సృజనశక్తి అంటే బ్రహ్మగా, స్థితికాలంలో పరిపాలనశక్తి అంటే విష్ణువుగా లయం చేసేటప్పుడు సంహరణశక్తి అంటే రుద్రుడుగా ఉంటావు. లలితాసహస్రంలో 264-269 నామాలలో ఇదే చెబుతున్నారు చూడండి.
(సృష్టికర్రీ బ్రహ్మ రూపా, గోస్త్రీ గోవిందరూపిణీ, సంహారిణీ రుద్రరూపా.) ఆ పరమేశ్వరి బ్రహ్మదేవుని రూపంలో ఈ జగత్తును సృష్టిస్తుంది. విష్ణుపు రూపంలో పోషించి పాలిస్తుంది. రుద్రుని రూపంలో లయం చేస్తుంది. అవే మాటలు చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. ఓ జగజ్జననీ సృష్టిస్థితి లయ కారకురాలవు నీవే. మహాజ్ఞాన మయివి నీవే. అజ్ఞానమయివి కూడా నీవే. అంటే విద్య, అవిద్య రెండూ నీవే. లలితాసహస్రంలో 790వ నామం చూడండి. పరాపరా పర, అపరా అంటే పరావిద్య, అపరావిద్య. ఏమిటివి? ముండకోపనిషత్తులో శౌనకుడికి అంగీరసుడు చెబుతాడు. వేదంలో రెండురకాల విద్యలున్నాయి.
1. "పరావిద్య" ఇది మోక్ష విద్య
2. "పరావిద్య" ఇది లౌకికమైన ఫలితాలు పొందటానికి ఉపయోగపడే విద్య. ఇదే కామ్యవిద్య. ఈ రెండింటిలోనూ మొదటిది జ్ఞానవిద్య, రెండవది అజ్ఞానము. ఈ రెండూ కూడా పరమేశ్వరి స్వరూపమే. నామము విద్యా అవిద్యా స్వరూపిణి.
ఓ దేవీ ! నీవు మహాబుద్ధివి మహాస్మరణశక్తివి. భ్రాంతిని కలిగించేది నీవే. మహాదేవివి నీవే. మహాఅసురిని నీవే. అంటే అన్ని శక్తులు ఆమే. సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి ఆమే. దారిద్ర్యాన్నిచ్చే జ్యేష్టాదేవి ఆమె. సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి ఆమే. దారిద్ర్యాన్నిచ్చే జ్యేష్టాదేవి ఆమే. ఆ దేవి ఎంతటి శుభశక్తి, అంతటి అశుభశక్తి కూడా.
తల్లీ ! సర్వమునకు మూలమైనటువంటి ప్రకృతివి నీవే. త్రిగుణము లను ప్రవర్తిల్లచేసే దానవు నీవే. త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణాలు నీవే. కల్పాంతాన ప్రళయకాలపు కాళరాత్రివి నీవే. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నీవే. భయంకరమైన మోహరాత్రివి నీవే. నీవే లక్ష్మీదేవివి. ఈశ్వరివి. హ్రీంకార స్వరూపానివి. ప్రబోధము కలిగించే జ్ఞానచిహ్నమైన బుద్ధివి నీవే. లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమి గలదానవు. ఖడ్గము, శూలము, గద, చక్రము, శంఖము, ధనుస్సు, భుశుండి, పరిఘ (ఇనుపకట్ల గద) మొదలైన ఆయుధాలు ధరించిన భయంకరివి. కాని క్షేమాన్ని కలిగించే శుభంకరి కూడా అవుతావు. అంటే శరణాగతులకు క్షేమంకరి, శత్రువులకు, దుర్మార్గులకు భయంకరి అని అర్థం.
జననీ ! శుభాలన్నింటిలోకీ అత్యంత శుభప్రదమైన దానవు. అత్యంత సౌందర్యవతివి. పరాపరములకు రెండింటికీ అతీతమైనదానివి.
సత్తు, అసత్తు అంటే చైతన్యము గలవి, చైతన్యములేనివి. ఈ రెండింటియందు గల శక్తివి నీవే. అఖిలాండకోటి బ్రహ్మాండనాయికవైన నిన్ను స్తుతించటం నా వల్లకాని పనికదా. సృష్టిస్థితిలయాలను చేసేవారు కూడా నీ దాసానుదాసులు. అటువంటి నిన్ను స్తుతి చేసే శక్తి ఎవరికి ఉంటుంది? త్రిమూర్తులకు పదవులిచ్చిన నిన్ను మేము ఏ రకంగా కొనియాడగలము. ఓ దేవీ ! అజేయులైన మధుకైటభులను సమ్మోహితులుగా చెయ్యి. విష్ణువు త్వరగా మేల్కొని ఆ రాక్షసులను సంహరించేటట్లుగా చూడవలసింది” అంటూ బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరిని ప్రార్థించాడు.
మహారాజా! ఈ రకంగా బ్రహ్మచేత ప్రార్థించబడిన ఆ తామసికశక్తి విష్ణువును వదలి బ్రహ్మకు దర్శనమిచ్చింది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాలను బట్టి మహామాయ మూడురూపాలు ధరిస్తున్నది. అందులో సాత్వికరూపము మహాసరస్వతి. రాజసికరూపము మహాలక్ష్మి. తామసికరూపము మహాకాళి.
ఎప్పుడైతే ఆ తామసిక శక్తి, మహామాయ విడిచిపెట్టిందో, అప్పుడు విష్ణువు నిద్ర నుంచి లేచాడు. ఎదురుగా మధుకైటభులు కనిపించారు. బ్రహ్మదేవుని రక్షించటం కోసం వారితో యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరు విష్ణువు ఒక్కడు. రాక్షసులు ఒకరి తరువాత ఒకరుగా విష్ణువుతో యుద్ధం చేస్తున్నారు. ఒకడు యుద్ధం చేస్తుండగా రెండవవాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇలా ఐదువేల సంవత్సరాలు గడచినాయి. అప్పుడు విష్ణువు వారితో 'మీరిద్దరు నేను ఒక్కడిని. మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు.
మరి నాకు విశ్రాంతి ఏది?' అన్నాడు. ఆ మాటలు విన్న రాక్షసులు విష్ణువు విశ్రాంతి తీసుకోవటానికి కొంతవ్యవధి ఇచ్చారు. ఈ సమయంలో విష్ణువు పరమేశ్వరిని ప్రార్థించాడు. ఆమె ప్రసన్నమై రాక్షససంహారానికి ఉపాయం చెప్పింది.
మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈసారి ఒక్క దెబ్బతో రాక్షసులు కిందపడేటట్లు చేసి “ఓ రాక్షసులారా! ఇంతవరకు నేను ఎందరో రాక్షసులతో యుద్ధం చేశాను. కాని ఇంతసేపు నాతో యుద్ధం చేసిన వారు లేరు. మీ పరాక్రమానికి మెచ్చాను ఏ వరం కావాలో కోరుకోండి?” అన్నాడు.ఈ మాటలు విన్న రాక్షసుల అహం దెబ్బతిన్నది. వారు విష్ణువుతో “నువు ఇచ్చే వాడివి. మేము పుచ్చుకునే వాళ్ళమూనా? ఏ వరం కావాలో నువ్వే కోరుకో. మేమే నీ కిస్తాము” అన్నారు. అవకాశం వదలుకోలేదు విష్ణుమూర్తి. "మీరు నా చేతిలో మరణించాలి" అన్నాడు. నివ్వెరపోయారు రాక్షసులు ఆ మాటలు విని. కొంతసేపటికి తెప్పరిల్లి, "అలాగే నీకోరిక తీరుస్తాం. కాకపోతే నీరు లేని చోట మమ్మల్ని సంహరించు” అన్నారు. వెంటనే విష్ణుమూర్తి తన ఆకారాన్ని బాగా పెంచేసి మధుకైటభులను తన తొడలమీద ఉంచి, చక్రాయుధంతో వారి శిరస్సులు ఖండించాడు.
“ఈ రకంగా బ్రహ్మదేవుని చేత స్తుతించబడి మధుకైటభ సంహారానికి కారణమైంది ఆ పరమేశ్వరి” అంటూ... *సప్తశతిలోని ప్రథమాధ్యాయాన్ని* పూర్తిచేశారు.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[18/05, 07:38] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 9వ భాగం:*_
_*👉 మధ్యమ చరితము:*_
_*👉 ద్వితీయాధ్యాయము:*_
_*ఓం అక్షస్రక్పరశూ గదేషుకులిశం - పద్మం ధనుః కుండికామ్*_
_*దండం శక్తి మసిం చ చర్మ జలజం - ఘంటాం సురాభోజనమ్ ।*_
_*శూలం పాశసుదర్శనే చ దధతీం - హస్త్రైః ప్రవాళప్రభామ్*_
_*సేవే సైరిభమర్దనీ మిహ మహా లక్ష్మీం సరోజస్థితామ్ ॥*_
పద్ధెనిమిది చేతులు గలిగి ఆ చేతులయందు అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణము, వజ్రాయుధము, కమలము, ధనుస్సు, కలశము, దండము, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మద్యపాత్ర, శూలము, పాశము, సుదర్శన చక్రము ధరించినది, పగడపు ఛాయ గలది, మహిషాసురుని సంహరించినది, పద్మమును ఆసనముగా గలది అయిన మహాలక్ష్మిని ధ్యానించుచున్నాను.
_*రెండవ అధ్యాయంలో 69 శ్లోకాలున్నాయి. దీనిలో 'మహిషాసుర సైన్యవధ' వివరించబడుతోంది.*_
సుమేధుడు లేదా మేధసుడు అనే ఋషి సురధుడు అనే రాజుకు, సమాధి అనే పేరు గల వైశ్యుడికి వివరిస్తున్నాడు.
_*దేవాసుర మభూ ద్యుద్ధం - పూర్ణ మద్దిశతం పురా |*_
_*మహిషేஉసురాణా మధిపే - దేవానాం చ పురందరే ॥*_
పూర్వకాలంలో ఒకసారి దేవాసుర సంగ్రామం జరిగింది. అందులో దేవతలకు నాయకుడుగా ఇంద్రుడు, రాక్షసులకు అధిపతిగా మహిషాసురుడు ఉన్నారు. ఈ యుద్ధం నూరు సంవత్సరాలు జరిగింది. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు. భూలోకంలో నూరు అశ్వమేధాలు చేసినవాడు ఇంద్రపదవి నలంకరిస్తాడు. మరి ఈ మహిషాసురుడు ఎవరు?
విష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టిన బ్రహ్మ కొన్నివేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని మెప్పించి ఆమెయొక్క అనుజ్ఞతో సృష్టి కార్యక్రమము కొనసాగిస్తూ అందులో భాగంగా మానసికంగా మరీచి, అంగీరసుడు, అత్రి, వసిష్టుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు అనే ఏడుగురిని సృష్టించాడు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. ఆ తరువాత రోషమువల్ల- రుద్రుడు, తొడ నుంచి నారదుడు, కుడిబ్రొటన వ్రేలు నుంచి దక్షుడు, ఎడమ బ్రొటనవ్రేలు నుంచి వీరిణి అనే కన్య పుట్టారు. దక్షుడు వీరిణిని వివాహం చేసుకున్నాడు. మరీచి కుమారుడైన కశ్యపుడు దక్షప్రజాపతి కుమార్తెలయిన అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, క్రోధ, పృధ, విశ్వ, వినత, కద్రువ, కపిల అనే 12 మందిని వివాహం చేసుకున్నాడు. కశ్యపుడికి దనువు నందు పుట్టిన వారు దానవులు. వారిలో రంభుడు కరంబుడు అనేవారిద్దరు. వీరికి సంతానం లేదు. అందుచేత సంతానం కోసం తపస్సు చెయ్యటం మొదలుపెట్టారు. రంభుడు తన చుట్టూ అగ్నిని ప్రజ్వరిల్లచేసి పంచాగ్నుల మధ్య ఉండి తపస్సు చేస్తున్నాడు. పంచాగ్నులు అంటే 1. పూర్వాగ్ని, 2. దక్షిణాగ్ని 3. పశ్చిమాగ్ని, 4. ఉత్తరాగ్ని, 5. సూర్యుడు. కరంబుడు పీకలోతు నీటిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు మొసలిరూపంలో వెళ్ళి కరంబుణ్ణి చంపేశాడు. తన సోదరుడు మరణించాడన్న వార్త విన్నాడు రంభుడు. అమితంగా దుఃఖించాడు. ఇంద్రుని మీద పగ తీర్చుకునేటందుకు గాను బలాఢ్యుడు, దేవతలను జయించగలవాడు అయిన పుత్రుడు కావాలి. అని అగ్నిదేవుని ప్రార్థించాడు. ఎంతసేపటికీ అగ్ని ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రంభుడు హోమగుండం సృష్టించి దానిలో తన తలను హోమం చెయ్యటానికి పూనుకున్నాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి రంభుడు “స్వామీ! అజేయుడు, అపూర్వబలశాలి, కామరూపి, ముల్లోకాలను జయించగలవాడు అయిన కుమారుడు కావాలి" అన్నాడు. అగ్నిదేవుడు రంభుని కోరిక మన్నించి “ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ముందుగా ఎవరిని చూసి కామిస్తావో వారి యందు నీకు పై లక్షణాలు గల పుత్రుడు కలుగుతాడు" అని చెప్పాడు.
ఈ రకంగా వరం పొందిన రంభుడు ఇంటికి బయలుదేరాడు. అతడు యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలు ఉండే ప్రాంతాలగుండా ప్రయాణి స్తున్నాడు. త్రోవలో ఎంతో మంది అప్సరాంగనలు, గంధర్వకాంతలు, దేవతాస్త్రీలు, అపురూపసౌందర్య రాసులు తారసపడ్డారు. కాని రంభుడి మనసు చలించలేదు.
అప్పటికి కొంతకాలం క్రితం 'మహిష్మతి' అనే గంధర్వకాంత శాపవశాన మహిషముగా అంటే 'గేదె' గా జన్మించింది. ఆ మహిషము సుందరీమణులయిన అప్సరాంగనలు తిరుగాడుతున్న ప్రదేశానికి కొంచెం దూరంగా, సెలయేటిగట్టున గడ్డిమేస్తోంది. ఆ గేదెను చూడగానే రంభుడి మనసు చలించింది. గతజన్మ ప్రారబ్ధం తప్పించటం ఎవరివల్ల అవుతుంది?
రంభుని మనసు చలించటమే తడవుగా ఆ గేదె గర్భం దాల్చింది. గర్భవతి అయిన గేదెను వెంటపెట్టుకుని ఇంటికి బయలుదేరాడు రంభుడు. కొంతకాలానికి ఆ గేదె దున్నపోతుతల, మనిషి శరీరము గల పిల్లవాణ్ణి ప్రసవించింది. పుత్రోదయం కాగానే మహిష్మతికి శాపవిమోచనం కలిగి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది.
ఆ బాలుడికి మహిషుడు అని నామకరణం చేశాడు రంభుడు. మహిషుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.'మరణం లేకుండా వరం కావాలి' అన్నాడు మహిషుడు. 'పుట్టిన ప్రతిప్రాణి మరణించి తీరవలసిందే. నేను కూడా శాశ్వతం కాదు. మరి నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? కాబట్టి ఇంకేదయినా వరం కోరుకో' అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు మహిషుడు. లోకంలో బలహీనమైన ప్రాణి స్త్రీ ఒక్కటే. ఆడదాన్ని అరికాలితో నలిపివేస్తాను కాబట్టి స్త్రీతో తప్ప మిగిలిన ఏ ప్రాణివల్లా ప్రాణహాని లేకుండా వరమియ్యవలసింది అన్నాడు. 'తథాస్తు' అన్నాడు విధాత.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[19/05, 06:09] 𝓢𝓾𝓻𝓮𝓼𝓱 𝓚𝓸𝓵𝓲𝓬𝓱𝓪𝓵𝓪: *నిరాకార లింగము*
(అక్కమహాదేవి వచనాలకు నా అనువాదం)
ఆకారము లేనిదే నిరాకార లింగము
చేతబట్టి మెడనుగట్టి తిరుగువారిదే అజ్ఞానము
హరిబ్రహ్మలే అరయని లింగము
వేద పురాణములు ఎరుగని లింగము
భక్తికి ఫలము లింగము కాదు
జ్ఞానుల విజ్ఞానము లింగము కాదు
కర్మల ప్రతిఫలము లింగము కాదు
తన్ను తానరసి తాదెలిసినచో
చెన్నమల్లికార్జునుడు తానేనని తెలియును కాదా!
కన్నడ మూలం:
ఆకారవల్లద నిరాకార లింగవ
కైయల్లి హిడిదు కట్టిదెవెంబరు అజ్ఞాని జీవిగళు.
హరిబ్రహ్మరు వేద పురాణ ఆగమంగళు
అరసి కాణద లింగ.
భక్తిగె ఫలవల్లదె లింగవిల్ల.
కర్మక్కె నరకవల్లదె లింగవిల్ల.
జ్ఞానక్కె పరిభ్రమణవల్లదె లింగవిల్ల.
వైరాగ్యక్కె ముక్తియల్లదె లింగవిల్ల.
ఇదు కారణ తన్న తానరిదు తానాదడె
చెన్నమల్లికార్జున తానె బేరిల్ల.
[19/05, 07:27] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 10వ భాగం:*_
బ్రహ్మ వరప్రసాది అయిన మహిషుడికి దైత్యగణాలన్నీ జయజయ ధ్వానాలతో స్వాగతం పలికి "రాజా! నీవు లేని సమయంలో దేవతలు మన రాజ్యం అపహరించారు!” అని చెప్పాయి. ఆ మాట విన్న మహిషుడు కోపంతో ఊగిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. భ్రుకుటి ముడిపడింది. కళ్ళనుంచి విస్ఫులింగాలు రాలినాయి. వీరావేశంతో పెద్దపెట్టున హుంకరిం చాడు. ఆ శబ్దానికి భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. దిక్కులు పిక్కటిల్లాయి. వెంటనే 1. అసిలోముడు, 2. ఉదర్కుడు 3. బిడాలుడు 4. బాష్కలుడు, 5. త్రినేత్రుడు 6. కాలబంధరుడు అనే వారిని దండనాయకులుగా, చిక్షురాక్షుడు సేనాధిపతిగా దైత్యగణాలు వెంట రాగా జైత్రమాత్రకు బయలుదేరాడు.
భూలోకంలో ఉండే రాజ్యాలన్నీ మహిషుని పాదాక్రాంతమైనాయి. అప్పుడు అతని దృష్టి దేవలోకం మీద పడింది. దేవ దానవ సంగ్రామం వంద సంవత్సరాలు గడిచింది.
_*తత్రాసురై ర్మహావీరై - ర్దేవసైన్యం పరాజితమ్ ।*_
_*జిత్వాచ సకలాన్ దేవా నింద్రోஉభూ న్మహిషాసురః ॥*_
ఆ యుద్ధంలో మహా బలపరాక్రమాలు గలిగినటు వంటి దేవసైన్య మంతా రాక్షసుల చేతిలో ఓడిపోయింది. దేవతలను జయించిన మహిషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు.
యుద్ధంలో ఓడిపోయిన దేవతలంతా బ్రహ్మను వెంట పెట్టుకుని శివుడు, విష్ణువు ఉన్న చోటికి వెళ్ళి జరిగినదంతా వారికి వివరించారు. “ఆ మహిషుడు దురాత్ముడయి సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలుగా గల దేవతల అందరి అధికారాలను లాక్కున్నాడు. స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుని సింహాసనం అధిష్ఠించాడు. దేవతల నందరినీ స్వర్గము నుంచి తరిమివేశాడు. ఇప్పుడు ఆ దేవతలంతా భూమి మీది మానవుల లాగా దిక్కుతోచక తిరుగుతున్నారు. మహానుభావులారా ! దేవలంతా మిమ్ములను శరణువేడుతున్నారు.
హరిహరులారా !
మీరిద్దరూ కూడా మాయందు దయ ఉంచి మహిషుని యొక్క పీడ వదిలిపోయే మార్గం ఆలోచించండి” అన్నారు.
_*ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః ।*_
_*చకార కోపం శంభుశ్చ - భ్రుకుటీకుటిలానలౌ ||*_
దేవతల మాటలు విన్నారు హరి హరులు. వారిద్దరికీ వెంటనే చాలా కోపం వచ్చింది. వారి ముఖాలు ఎర్రబారినాయి. కోపంతో కనుబొమలు ముడివడినాయి.
_*తతోஉతికోపపూర్ణస్య - చక్రిణో వదనా త్తతః |*_
_*నిశ్చక్రామ మహత్తేజో - బ్రహ్మణః శంకరస్య చ ॥*_
_*అన్యేషాం చైవ దేవానాం - శక్రాదీనాం శరీరతః |*_
_*నిర్గతం సుమహత్తేజ - స్తచ్చైక్యం సమగచ్ఛత ॥*_
కోపంతో భయంకరంగా మారిన విష్ణువు ముఖం నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. అదే విధంగా బ్రహ్మ, శివుల ముఖముల నుండి కూడా తేజస్సు బయటకు వచ్చింది. అంతే కాదు అక్కడ ఉన్న ఇంద్రాది దేవతల ముఖాల నుండి కూడా వారి తేజస్సు బయటకు వచ్చింది.
అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతమ్ |
దదృశుస్తే సురా స్తత్ర - జ్వాలావ్యాప్త దిగంతరమ్ ॥
_*అతులం తత్ర తత్తేజః - సర్వదేవశరీరజమ్ ।*_
_*ఏకస్థం తదభూ న్నారీ - వ్యాప్తలోకత్రయం త్విషా ॥*_
దేవతల అందరి శరీరాల నుండి వచ్చినటువంటి అన్ని వైపులకు కాంతులు వెదజల్లుతూ, మండుతున్న అగ్ని పర్వతంలాగా ఉన్నది. దాని కాంతులు ముల్లోకాలకూ వ్యాపిస్తున్నాయి. ఈ రకంగా దేవత లందరి శరీరముల నుండి వచ్చినటువంటి ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం దాల్చింది. వివిధ దేవతల తేజస్సు ఆ స్త్రీమూర్తి శరీరంలోని వివిధ అంగాలు అయినాయి.
_*య దభూ చ్ఛాంభవం తేజ- స్తేనాஉ జాయత తన్ముఖమ్ |*_
_*యామ్యేన చాభవన్ కేశా - బాహవో విష్ణుతేజసా ॥*_
_*సౌమ్యేన స్తనయో ర్యుగ్మం - మధ్య మైంద్రేణ చా భవత్ |*_
_*వారుణేన చ జంఘోరూ నితంబ స్తేజసా భువః ॥*_
శివుని యొక్క తేజస్సుతో ఆమె ముఖము ప్రకాశిస్తున్నది.
యముని యొక్క తేజస్సుతో-కేశపాశాలు,
విష్ణువు యొక్క తేజస్సుతో-బాహువులు,
చంద్రుని యొక్క తేజస్సుతో- స్తనద్వయము,
ఇంద్రుని యొక్క తేజస్సుతో-నడుము,
వరుణుని యొక్క తేజస్సుతో-పిక్కలు, తొడలు,
భూమి యొక్క తేజస్సుతో-పిరుదులు,
బ్రహ్మ యొక్క తేజస్సుతో-పాదాలు,
సూర్యుని యొక్క తేజస్సుతో-కాలివ్రేళ్ళు,
అష్టవసువుల యొక్క తేజస్సుతో-చేతివేళ్ళు,
కుబేరుని యొక్క తేజస్సుతో-నాసిక (ముక్కు),
ప్రజాపతి యొక్క తేజస్సుతో-దంతాలు,
అగ్ని యొక్క తేజస్సుతో-మూడు నేత్రాలు,
రెండుసంధ్యల యొక్క తేజస్సుతో-కనుబొమలు,
వాయువు యొక్క తేజస్సుతో-చెవులు.
_*తతః సమస్తదేవానాం - తేజోరాశిసముద్భవామ్ |*_
_*తాం విలోక్య ముదం ప్రాపు రమరా మహిషార్దితాః ||*_
ఈ రకంగా దేవతలందరి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన ఆమెను చూసి మహిషుని చేత బాధించబడినటువంటి దేవతలంతా సంతసించారు. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించటం బాగానే ఉంది. దేవతల అందరి తేజస్సుతోను ఉద్భవించింది. కాబట్టి మహిషుడు స్త్రీమూర్తి చేతిలో తప్ప ఇతరులచేత చావడు కాబట్టి దేవతలందరికీ ఆనందంగానే ఉంది. అయితే యుద్ధం చెయ్యటానికి ఆమెకు ఏ రకమైన ఆయుధాలూ లేవు. మరి ఏ రకంగా ఆ రాక్షసుని సంహరిస్తుంది? ఆలోచించారు దేవతలు. ఇంతలో...
_*శూలం శూలా ద్వినిష్కృష్య - దదౌ తస్యై పినాకధృక్ |*_
_*చక్రం చ దత్తవాన్ కృష్ణః - సముత్పాట్య స్వచక్రతః ॥*_పినాకపాణి అంటే శివుడు తన శూలము నుండి ఒక శూలాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. విష్ణువు తన చక్రంలో నుంచి ఒక చక్రాన్ని తీసి ఇచ్చాడు. ఈ రకంగా...
వరుణుడు- శంఖాన్ని ఇచ్చాడు
అగ్నిదేవుడు- బల్లెము నిచ్చాడు
వాయుదేవుడు - ధనుస్సు, బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులు ఇచ్చాడు.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[19/05, 07:27] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 10వ భాగం:*_
బ్రహ్మ వరప్రసాది అయిన మహిషుడికి దైత్యగణాలన్నీ జయజయ ధ్వానాలతో స్వాగతం పలికి "రాజా! నీవు లేని సమయంలో దేవతలు మన రాజ్యం అపహరించారు!” అని చెప్పాయి. ఆ మాట విన్న మహిషుడు కోపంతో ఊగిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. భ్రుకుటి ముడిపడింది. కళ్ళనుంచి విస్ఫులింగాలు రాలినాయి. వీరావేశంతో పెద్దపెట్టున హుంకరిం చాడు. ఆ శబ్దానికి భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. దిక్కులు పిక్కటిల్లాయి. వెంటనే 1. అసిలోముడు, 2. ఉదర్కుడు 3. బిడాలుడు 4. బాష్కలుడు, 5. త్రినేత్రుడు 6. కాలబంధరుడు అనే వారిని దండనాయకులుగా, చిక్షురాక్షుడు సేనాధిపతిగా దైత్యగణాలు వెంట రాగా జైత్రమాత్రకు బయలుదేరాడు.
భూలోకంలో ఉండే రాజ్యాలన్నీ మహిషుని పాదాక్రాంతమైనాయి. అప్పుడు అతని దృష్టి దేవలోకం మీద పడింది. దేవ దానవ సంగ్రామం వంద సంవత్సరాలు గడిచింది.
_*తత్రాసురై ర్మహావీరై - ర్దేవసైన్యం పరాజితమ్ ।*_
_*జిత్వాచ సకలాన్ దేవా నింద్రోஉభూ న్మహిషాసురః ॥*_
ఆ యుద్ధంలో మహా బలపరాక్రమాలు గలిగినటు వంటి దేవసైన్య మంతా రాక్షసుల చేతిలో ఓడిపోయింది. దేవతలను జయించిన మహిషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు.
యుద్ధంలో ఓడిపోయిన దేవతలంతా బ్రహ్మను వెంట పెట్టుకుని శివుడు, విష్ణువు ఉన్న చోటికి వెళ్ళి జరిగినదంతా వారికి వివరించారు. “ఆ మహిషుడు దురాత్ముడయి సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలుగా గల దేవతల అందరి అధికారాలను లాక్కున్నాడు. స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుని సింహాసనం అధిష్ఠించాడు. దేవతల నందరినీ స్వర్గము నుంచి తరిమివేశాడు. ఇప్పుడు ఆ దేవతలంతా భూమి మీది మానవుల లాగా దిక్కుతోచక తిరుగుతున్నారు. మహానుభావులారా ! దేవలంతా మిమ్ములను శరణువేడుతున్నారు.
హరిహరులారా !
మీరిద్దరూ కూడా మాయందు దయ ఉంచి మహిషుని యొక్క పీడ వదిలిపోయే మార్గం ఆలోచించండి” అన్నారు.
_*ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః ।*_
_*చకార కోపం శంభుశ్చ - భ్రుకుటీకుటిలానలౌ ||*_
దేవతల మాటలు విన్నారు హరి హరులు. వారిద్దరికీ వెంటనే చాలా కోపం వచ్చింది. వారి ముఖాలు ఎర్రబారినాయి. కోపంతో కనుబొమలు ముడివడినాయి.
_*తతోஉతికోపపూర్ణస్య - చక్రిణో వదనా త్తతః |*_
_*నిశ్చక్రామ మహత్తేజో - బ్రహ్మణః శంకరస్య చ ॥*_
_*అన్యేషాం చైవ దేవానాం - శక్రాదీనాం శరీరతః |*_
_*నిర్గతం సుమహత్తేజ - స్తచ్చైక్యం సమగచ్ఛత ॥*_
కోపంతో భయంకరంగా మారిన విష్ణువు ముఖం నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. అదే విధంగా బ్రహ్మ, శివుల ముఖముల నుండి కూడా తేజస్సు బయటకు వచ్చింది. అంతే కాదు అక్కడ ఉన్న ఇంద్రాది దేవతల ముఖాల నుండి కూడా వారి తేజస్సు బయటకు వచ్చింది.
అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతమ్ |
దదృశుస్తే సురా స్తత్ర - జ్వాలావ్యాప్త దిగంతరమ్ ॥
_*అతులం తత్ర తత్తేజః - సర్వదేవశరీరజమ్ ।*_
_*ఏకస్థం తదభూ న్నారీ - వ్యాప్తలోకత్రయం త్విషా ॥*_
దేవతల అందరి శరీరాల నుండి వచ్చినటువంటి అన్ని వైపులకు కాంతులు వెదజల్లుతూ, మండుతున్న అగ్ని పర్వతంలాగా ఉన్నది. దాని కాంతులు ముల్లోకాలకూ వ్యాపిస్తున్నాయి. ఈ రకంగా దేవత లందరి శరీరముల నుండి వచ్చినటువంటి ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం దాల్చింది. వివిధ దేవతల తేజస్సు ఆ స్త్రీమూర్తి శరీరంలోని వివిధ అంగాలు అయినాయి.
_*య దభూ చ్ఛాంభవం తేజ- స్తేనాஉ జాయత తన్ముఖమ్ |*_
_*యామ్యేన చాభవన్ కేశా - బాహవో విష్ణుతేజసా ॥*_
_*సౌమ్యేన స్తనయో ర్యుగ్మం - మధ్య మైంద్రేణ చా భవత్ |*_
_*వారుణేన చ జంఘోరూ నితంబ స్తేజసా భువః ॥*_
శివుని యొక్క తేజస్సుతో ఆమె ముఖము ప్రకాశిస్తున్నది.
యముని యొక్క తేజస్సుతో-కేశపాశాలు,
విష్ణువు యొక్క తేజస్సుతో-బాహువులు,
చంద్రుని యొక్క తేజస్సుతో- స్తనద్వయము,
ఇంద్రుని యొక్క తేజస్సుతో-నడుము,
వరుణుని యొక్క తేజస్సుతో-పిక్కలు, తొడలు,
భూమి యొక్క తేజస్సుతో-పిరుదులు,
బ్రహ్మ యొక్క తేజస్సుతో-పాదాలు,
సూర్యుని యొక్క తేజస్సుతో-కాలివ్రేళ్ళు,
అష్టవసువుల యొక్క తేజస్సుతో-చేతివేళ్ళు,
కుబేరుని యొక్క తేజస్సుతో-నాసిక (ముక్కు),
ప్రజాపతి యొక్క తేజస్సుతో-దంతాలు,
అగ్ని యొక్క తేజస్సుతో-మూడు నేత్రాలు,
రెండుసంధ్యల యొక్క తేజస్సుతో-కనుబొమలు,
వాయువు యొక్క తేజస్సుతో-చెవులు.
_*తతః సమస్తదేవానాం - తేజోరాశిసముద్భవామ్ |*_
_*తాం విలోక్య ముదం ప్రాపు రమరా మహిషార్దితాః ||*_
ఈ రకంగా దేవతలందరి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన ఆమెను చూసి మహిషుని చేత బాధించబడినటువంటి దేవతలంతా సంతసించారు. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించటం బాగానే ఉంది. దేవతల అందరి తేజస్సుతోను ఉద్భవించింది. కాబట్టి మహిషుడు స్త్రీమూర్తి చేతిలో తప్ప ఇతరులచేత చావడు కాబట్టి దేవతలందరికీ ఆనందంగానే ఉంది. అయితే యుద్ధం చెయ్యటానికి ఆమెకు ఏ రకమైన ఆయుధాలూ లేవు. మరి ఏ రకంగా ఆ రాక్షసుని సంహరిస్తుంది? ఆలోచించారు దేవతలు. ఇంతలో...
_*శూలం శూలా ద్వినిష్కృష్య - దదౌ తస్యై పినాకధృక్ |*_
_*చక్రం చ దత్తవాన్ కృష్ణః - సముత్పాట్య స్వచక్రతః ॥*_పినాకపాణి అంటే శివుడు తన శూలము నుండి ఒక శూలాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. విష్ణువు తన చక్రంలో నుంచి ఒక చక్రాన్ని తీసి ఇచ్చాడు. ఈ రకంగా...
వరుణుడు- శంఖాన్ని ఇచ్చాడు
అగ్నిదేవుడు- బల్లెము నిచ్చాడు
వాయుదేవుడు - ధనుస్సు, బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులు ఇచ్చాడు.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[21/05, 08:43] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 12వ భాగం:*_
'అసిలోముడు’ అనేవాడు 150 లక్షల రథాలతో వచ్చాడు. బాష్కలుడు 60 లక్షల రథాలతో యుద్ధానికి వచ్చాడు. పరివారితుడు అనే రాక్షసుడు కొన్నివేల ఏనుగులను, గుర్రాలను, కోటి రథాలను వెంటపెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. బిడాలుడు 700 కోట్ల రథాలకు ఆధిపత్యం వహించి దేవితో యుద్ధానికి దిగాడు. మిగిలిన కొన్నివేల మంది రాక్షసులు చతురంగబలాలతో ఆ దేవిని చుట్టుముట్టారు.
ఆ యుద్ధంలో మహిషాసురుడు కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు, రథాలతో పరివేష్టించబడి ఉన్నాడు. అంటే అతని చుట్టూ ఈ బలగమంతా ఉన్నదన్నమాట. రాక్షస వీరులంతా బల్లాలు, కత్తులు, గదలు, గొడ్డళ్ళు, రోకళ్ళు ధరించి యుద్ధచేస్తున్నారు. కొందరు పాశాలను, మరికొందరు శూలాలను ఆ దేవి మీదకు విసురుతున్నారు. ఆమెను సంహరించటం కోసం కొంత మంది ఆమెను కత్తులతో కొడుతున్నారు. రాక్షసులు ప్రయోగించిన శస్త్రాస్త్రాలను ఆ దేవి అవలీలగా ఖండించి వేసింది ఏ మాత్రమూ హైరానాపడకుండా రాక్షసులు మీద ఆయుధాలను ప్రయోగిస్తున్నది. దేవి వాహనమైన సింహము ఒక్కసారిగా జూలు విదిల్చు, పెద్దగా గర్జించి మహారణ్యంలో కార్చిచ్చులాగా రాక్షససేనపై పడింది. యుద్ధంచేస్తూ మధ్యలో ఆమె నిటూర్పులు వదుల్తోంది. ఆ నిట్టూర్పుల నుంచి కొన్ని వేలు, లక్షలు సైన్యము పుడుతోంది. ఆ సైన్యమంతా గండ్రగొళ్ళలు, కత్తులు ధరించి రాక్షససైన్యాన్ని నాశనం చేస్తున్నది.
ఈ రకంగా భీకరమైన యుద్ధం జరుగుతుండగా, ఆ రణోత్సాహంలో కొందరు తప్పెటలు వాయిస్తున్నారు. కొందరు శంఖాలు ఊదుతున్నారు. మరికొందరు మృదంగాలు వాయిస్తున్నారు..
ఆ సమయంలో దేవి రాక్షసులను తన త్రిశూలంతో గ్రుచ్చి చంపు తున్నది. కొందరిని గదతో మోది, కొందరిని బల్లెములతో పొడిచి ఇంకొందరిని కత్తితో నరికి చంపింది. ఆమె చేతిలో ఉన్న ఘంటానాదానికి రాక్షసుల చెవులు తలలు పగిలిపోయినాయి. రాక్షసులను ఒక వైపు పాశంతో కట్టి ఈడుస్తున్నది. కొందరిని కత్తితో రెండు ముక్కలుగా నరుకుతున్నది.
ఆమె చేతిలోని గదతో దెబ్బ తగిలినవారు ఇంక లేవటంలేదు. ఆమె రోకటిపోటుకు నెత్తురు కక్కుకుని మరణిస్తున్నారు.
కొందరు రాక్షసవీరులను ఆ దేవి తన త్రిశూలంతో గుండెలు చీల్చి వేసింది. ఆమె ప్రయోగించిన బాణాలు ఒళ్ళంతా గుచ్చుకుని రాక్షసులు ముళ్ళసందులలాగా కనిపిస్తున్నారు. కొందరికి చేతులు తెగిపోయినాయి. కొందరికి కాళ్ళు తెగిపోయినాయి. కొందరికి కంఠాలు తెగిపోయినాయి. కొందరి తలలు భూమి మీద బంతులలాగా దొర్లుతున్నాయి. ఒక కన్ను, ఒక కాలు, ఒక చేయితో ఇంకా బ్రతికి ఉన్న రాక్షసులను దేవి ముక్కలు ముక్కలుగా నరుకుతున్నది.
తెగిపోయిన కొన్ని మొండాలు ఆయుధాలు ధరించి ఇంకా పరుగెడు తున్నాయి. మరికొన్ని మొండేలు మ్రోగుతున్న వాద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తున్నాయి.
కొంతమంది మహావీరుల శరీరాలు తెగిపోయినప్పటికీ, ఆ మొండాలు కత్తులు, బల్లాలు పట్టుకుని దేవి మీదికి పోతున్నాయి. అప్పుడే తెగిన తలలు కేకలు పెడుతున్నాయి. యుద్ధభూమి అంతా ఏనుగుల, గుర్రాల, సైనికుల శవాలతో చిందరవందరగా ఉన్నది. విరిగిపోయిన రథాలు, ముక్కలైన రక్తం ఏరులై పారుతున్నది. ఆయుధాలు అడ్డదిడ్డంగా పడిఉన్నాయి. రక్తం ఏరులై పారుతున్నది. ఆ ప్రదేశమంతా నడవడానికి కాదు కదా కాలుపెట్టటానికి కూడా వీలులేకుండా ఉన్నది.
ఏనుగులు, గుర్రాలు, మహాసైన్యము యొక్క రక్తము నదిలాగా ప్రవహిస్తున్నది. గడ్డిమోపును అగ్ని దహించి వేసినట్లుగా రాక్షస సైన్యాన్ని ఆ పరమేశ్వరి క్షణంలో నాశనం చేసింది.
దేవి వాహనమైన సింహము రాక్షసవీరుల దేహంలో ఇంకా ఎక్కడైనా ప్రాణమున్నదేమో అని ఆ ప్రదేశమంతా వెదుకుతున్నది.
_*యథై షాం తుతుషు ర్దేవాః - పుష్పవృష్టిముచో దివి ॥*_
ఆ సమయంలో దేవి చేసిన రాక్షస సంహారాన్ని కనులారా కాంచిన దేవతలు పూలవాన కురిపించారు. అంటూ _*రెండవ అధ్యాయాన్ని పూర్తి చేశారు.*_
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[22/05, 07:07] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 13వ భాగం:*_
_*👉 మహిషాసుర వధ:*_
_*👉 తృతీయాధ్యాయము:*_
_*ఈ అధ్యాయంలో 44 శ్లోకాలున్నాయి. ఋషిరువాచ ఋషి చెబుతున్నాడు.*_
ఇప్పటి వరకు రెండవ అధ్యాయంలో మహిషాసుర సైన్యవధను వివరించిన మహర్షి ఇప్పుడంటున్నాడు రాజా!
_*నిహన్య మానం తత్సైన్య మవలోక్య మహాసురః | సేనానీ శ్చిక్షురః కోపా ద్యయౌ యోద్దు మథాஉoబికామ్ ॥*_
_*స దేవీం శరవర్షణ వవర్ష సమరే సురః | యథామేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః ||*_
తన యొక్క సైన్యమంతా నాశన మయిపోవటం చూసినటువంటి సేనాధిపతి అయిన చిక్షురాక్షుడు కోపంతో ఊగిపోయాడు. అశేష బలపరాక్రమాలు గలిగినటువంటి రాక్షససేన ఈ రకంగా పరాజయం పాలుకావటం అతడు భరించలేక, మితిమీరిన ఆవేశంతో దేవితో యుద్ధానికి వచ్చాడు.
వచ్చేరావటంతోనే మేరుపర్వతం మీద వర్షం కురిసినట్లుగా ఆ దేవి మీద శరవర్షం కురిపించాడు. మేరుపర్వతం చాలా ఎత్తైనది చాలా విశాలమైనది. అందుచేత మేఘాలు ఆ పర్వతాన్ని దాటిపోలేవు. కారణంగా మేఘం పూర్తిగా ఆ పర్వతం మీద వర్షిస్తుంది. అదే విధంగా మహిషుని యొక్క సేనాని అయిన చిక్షురుడు కూడా మేరు పర్వతం మీద మేఘంలాగా ఎడతెరిపి లేకుండా శరవర్షం కురిపించాడు. పరమేశ్వరి ఎదురుదాడి చేసింది. ఆ రాక్షసుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ మధ్యలోనే త్రుంచిపారేసింది. అదనుచూసి పదునైన బాణాలతో అతని రథానికి పూన్చిన అశ్వాలను, సారథిని సంహరించింది.
ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయినాడు చిక్షురుడు. అతడు తేరుకొనే లోపల ఆ రాక్షస వీరుని చేతిలో గల ధనుస్సు విరిగిపోయింది. చూస్తూండగానే అతని రథం విరిగి ముక్కలైపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు అతడికి. ప్రక్కనే ఉన్న ఇంకొక ఆయుధం తీసుకోపోయేంతలో పదునైన బాణాలు అతని శరీరమంతా గ్రుచ్చుకున్నాయి.
_*స చ్ఛిన్నధన్వా విరథో హతాశ్వోహతసారథిః | అభ్యధావత తాం దేవీం ఖడ్గచర్మధరోஉసురః ||*_
విల్లు విరిగిపోయింది. రథం లేదు. గుర్రాలు లేవు. సారథి చచ్చిపోయాడు. ఒళ్ళంతా గాయాలైనాయి. అయినప్పటికీ ఊరుకోలేదు అతడు. కత్తి డాలు తీసుకొని ఆ దేవి మీదికి ఉరికాడు. కన్నుమూసి తెరిచే లోపల కత్తితో సింహం తల మీద కొట్టాడు. మరుక్షణంలో ఆ కత్తితో పరమేశ్వరి ఎడమ భుజం మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ ఖడ్గం పరమేశ్వరిని తాకటంతోనే రాతిని తగిలిన మట్టిబెడ్డలాగా ముక్కలు ముక్కలైపోయింది. ఈ రకంగా తన కత్తి విరిగి ముక్కలు కావటం చూసేసరికి కోపంతో సేనాని అయిన చిక్షురుని కనులు ఎర్రబారినాయి. దగ్గరలో ఉన్న శూలాన్ని అందుకున్నాడు. ఆ శూలం గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నది. ఆ రాక్షస వీరుడు శూలాన్ని ఆ దేవిపై విసిరాడు. అది ఆకాశం నుండి సూర్యబింబము క్రిందికి రాలిపడినట్టుగా ఆ దేవిని తాకబోయింది. ఆ సమయంలో పరమేశ్వరి తన చేతిలోని కత్తిని మెరుపు వేగంతో విసిరింది. ఆ దెబ్బకు శూలంతో పాటుగా రాక్షసుని శరీరం కూడా నూరు ముక్కలైపోయింది. ఈ రకంగా మహిషాసురుని సేనాని అయిన చిక్షురాక్షుడు యుద్ధంలో మరణించాడు.
_*హతే తస్మి న్మహావీర్యే - మహిషస్య చమూపతౌ | ఆజగామ గజారూఢ - శ్చామర స్త్రిదశార్దనః ||*_
ఎప్పుడైతే సేనాని చిక్షురుడు మరణించాడో, అప్పుడు మహావీరుడైన 'చామరుడు' అనే రాక్షసవీరుడు ఏనుగునెక్కి ఆ దేవిని ఎదిరించటానికి బయలుదేరాడు. వచ్చీరావటంతోనే పదునైన బల్లెం ఒకటి ఆ దేవి మీద విసిరాడు. ఆ దేవి ఒక్క 'హుం' కారంతో ఆ బల్లేన్నికాస్తా నిర్వీర్యం చేసి వేసింది. ఆ బల్లెం నేలమీద పడిపోయింది.
తన బల్లెం ఉపయోగం లేకుండా నేల మీద పడిపోవటం చూసిన చామరుడు, రెట్టించిన పౌరుషంతో ఒక శూలాన్ని విసిరాడు. ఆ పరమేశ్వరి దాన్ని తన బాణాలతో ముక్కలు చేసిపారేసింది. పరమేశ్వరి వాహనమైన సింహము ఒక్క ఎగురు ఎగిరి ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని ఆ;రాక్షసునితో తలపడింది.
ఈ రకంగా వారిద్దరూ బాహుయుద్ధం చేస్తూ ఏనుగు మీద నుంచి నేలమీదికి వచ్చారు. సింహం భయంకరమైన గర్జనలు చేస్తూ రాక్షసుని మీద పడుతోంది. రాక్షసుడు ఆ సింహాన్ని సర్వ విధాలా ప్రతిఘటిస్తున్నాడు. వీరిద్దరి మధ్యనా పోరు ఘోరంగా సాగుతున్నది. ఈ పరిస్థితిలో ఉన్నట్టుండి దేవి వాహనమైన సింహము ఒక్కసారిగా ఆకాశం లోకి ఎగిరి క్రిందికి దూకుతూ తన ముందరి కుడి కాలి దెబ్బతో చామరుని శిరస్సు ఖండించి వేసింది. ఆ దెబ్బకు రాక్షసుడి తల ఎగిరి క్రింది పడిపోయింది.
చామరుడు కూడా మరణించేప్పటికి మిగిలిన రాక్షసవీరులు ఒక్కసారిగా ఆ పరమేశ్వరిని చుట్టుముట్టారు. అన్నివైపుల నుంచి ఆవిడ మీదకు ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. సరిస్థితిని గమనించింది. పరమేశ్వరి. ఇక ఉపేక్షించి లాభంలేదని నిశ్చయించుకొని వీర విహారం చెయ్యటం మొదలుపెట్టింది. 'ఉదగ్రుడు' అనే వాణ్ణి రాళ్ళతో కొట్టి చంపింది. 'కరాళుడు' అనే రాక్షసవీరుని పిడికిళ్ళతో పొడిచి చంపింది. 'ఉద్ధతుడు' అనే రాక్షసుణ్ణి తన గదతో మోది చూర్ణం చేసింది. 'భాష్కలుడి'ని ఇనుపకట్లు వేసిన గుదియతో తల పగలకొట్టి చంపింది. తామ్రుడు, బంధకుడు అనేవారిని బాణాలతో సంహరించింది. ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు అనే వారిని త్రిశూలంతో గ్రుచ్చి చంపింది. బిడాలుని శిరస్సు కత్తితో తెగనరికింది.దుర్దరుడు, దుర్ముఖుడు అనే వారిని బాణాలతో గ్రుచ్చి గ్రుచ్చి చంపింది.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[23/05, 08:45] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 14వ భాగం:*_
_*👉 మహిషాసుర వధ:*_
_*ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః | మాహిషేణ స్వరూపేణ - త్రాసయామాస తాన్ గణాన్ ॥*_
తన సైన్యమంతా ఈ రకంగా నాశనమైపోవటం చూశాడు మహిషాసురుడు. స్వయంగా తాను మహిష రూపం ధరించి పరమేశ్వరి సైన్యాన్ని ఎదిరించాడు. అతడి దెబ్బకు దేవతా సైన్యం భీతిల్లిపోయింది. ఇక విజృంభించాడు మహిషాసురుడు. దేవతా సైన్యంలో కొందరిని తన మోరతోకొట్టి పడగొట్టాడు. కొందరిని తన రంకెలతో అదరగొట్టి చంపేశాడు, కొందరిని తను గిరగిరా తిరుగుతూ త్రొక్కి చంపేశాడు. ఇంకొందరు అతడు వదలిన గాలికి మరణించారు.
మహావీరుడైన మహిషాసురుడు నేల మీద గిట్టలతో భూమిని దుమ్ముగా చేస్తున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను తన కొమ్ములతో ఎగురేస్తున్నాడు. భయంకరంగా రంకెలు పెడుతున్నాడు. అతడి రంకెలకు భూనభోంతరాళాలు దద్దరిల్లిపోతున్నాయి. అతడు గిరగిరా తిరుగుతూంటే భూమి అరిగిపోతోంది. అతడు తోకను విసురుతూంటే సముద్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. కొమ్ములు కదుపుతుంటే మేఘాలు చిందర వందర అవుతున్నాయి. గాలి వదులుతుంటే ఆ వేగానికి పర్వతాలు ఎగిరి పడుతున్నాయి. ఈ రకంగా భయంకరమైన యుద్ధం చేస్తూ దేవి వాహనమైన సింహాన్ని చంపబోయాడు. చూసింది చండిక. ఇక లాభం లేదనుకుని తన చేతిలోని పాశంతో అతణ్ణి బంధించి వేసింది.
ఈ రకంగా బంధించబడగానే ఆ రాక్షసుడు తన మహిష రూపాన్ని వదలిపెట్టి సింహం అయినాడు. అంబిక ఆ సింహం తలనరికి పారేసింది. ఆ రాక్షసుడు మనిషిగా మారి కత్తి చేత్తో తీసుకుని ఆమె మీదికి వెళ్ళాడు. మరుక్షణమే పరమేశ్వరి అతడి చేతిలోని కత్తిని, డాలును ముక్కలు చేసి వేసింది. దాంతో అతడు పెద్ద ఏనుగు అయి ఘీంకారం చేస్తూ తన తొండంతో దేవి వాహనమైన సింహాన్ని చుట్టేశాడు.. పరమేశ్వరి కత్తితో ఏనుగు తొండాన్ని నరికి వేసింది. వెంటనే ఆ రాక్షసుడు మహిష రూపందాల్చి ముల్లోకాలను అల్లకల్లోలం చెయ్యటం మొదలుపెట్టాడు.
_*తతః క్రుద్ధా జగన్మాతా చండికా పానముత్తమమ్ | పపౌ పునః పునశ్చైవ జహాసారుణలోచనా ॥*_
అదంతా చూసినటువంటి జగన్మాత అయిన ఆ చండిక తన చేతిలోని దివ్యపానీయాన్ని త్రాగుతూ కోపంతో వికటాట్టహాసం చేసింది. ఆ రాక్షసుడు కూడా మదోన్మత్తుడై మహానాదం చేసి, తన కొమ్ములతో పర్వతాలను ఎత్తి చండిక మీదికి విసిరాడు. తన మీదికి విసరబడిన పర్వతాలను ఆ దేవి తన బాణాలతో సుగ్గునుగ్గు చేసి మితిమీరిన కోపంతో మాటలు తడబడగా...
_*గర్జ గర్జ క్షణం మూఢ - మధు యావ త్పిబామ్యహమ్ | మయా త్వయి హతేஉత్రైవ - గర్జిష్యం త్యాశు దేవతా ॥*_
“ఓరీ మూర్ఖుడా! ఇంకెంత సేపు. నేను ఈ దివ్యపానీయాన్ని త్రాగేవరకేరా నువ్వు గర్జించేది. ఆ తరువాత నిన్ను నేను చంపేస్తాను. అది చూసి దేవతలు త్వరలోనే ఆనందంతో కేకలు వేస్తారు" అని ఎగిరి ఆ రాక్షసుని మీదపడి, కాలితో అతని కంఠాన్ని త్రొక్కిపట్టి శూలంతో ఒక్క పోటు పొడిచింది. ఆ దెబ్బతో అతడు తన మహిష రూపం వదలి నిజరూపం అంటే శరీరం మాత్రం మనిషి, దున్నపోతు తల ధరించాడు. ఆ రకంగా ఉన్న మహిషాసురుని తలను పరమేశ్వరి తన కత్తితో నరికి చంపేసింది. దృశ్యాన్ని చూసిన రాక్షస గణాలన్నీ హాహాకారాలు చేస్తూ పారిపోయినాయి.
_*తుష్టువు స్తాం సురా దేవీం సహ దివ్యై ర్మహర్షిభిః | -జగు ర్గంధర్వపతయో - ననృతు శ్చాప్సరోగణాః ||*_
దేవత లందరూ ఆనందంతో గంతులు వేశారు. మహర్షులు పరమేశ్వరిని పరిపరి విధాల స్తుతించారు. అప్సరలు ఆడారు. గంధర్వలు పాడారు. అంటూ... _*మూడవ అధ్యాయంలో మహిషాసుర వధను పూర్తి చేశారు.*_
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[24/05, 07:55] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 15వ భాగం:*_
_*👉 శక్రాది స్తుతి:*_
_*👉 నాల్గవ అధ్యాయము:*_
_*👉 ఈ అధ్యాయంలో 42 శ్లోకాలున్నాయి.*_
శోర్య, బల, పరాక్రమ సంపన్నుడు, వరబలగర్వితుడు, దుర్మార్గుడు, దురాత్ముడు, ధర్మ నాశకుడు, సురవైరి అయిన మహిషాసురుడు, అతని సేనాసమూహమూ పూర్తిగా నశించిపోయింది. పరమేశ్వరి వీరి నందరినీ సంహరించింది. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ భక్తి వినమ్రులై చేతులు జోడించి, కనుల వెంట ఆనందబాష్పాలు చిందిస్తూ ముక్తకంఠంతో ఆ పరమేశ్వరుని పరిపరి విధాల కీర్తించారు. నాల్గవ అధ్యాయలలో ఇంద్రాది దేవతలు చేసిన ఈ స్తోత్రాన్ని పఠించినట్లైతే మధ్యమ చరితము పారాయణ చేసిన ఫలితము వస్తుంది. ఇది లక్ష్మీప్రదము.
_*దేవ్యా యయా తత మిదం జగ దాత్మశక్త్వా - నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా ।*_
_*తా మంబికా మఖిలదేవమహర్షిపూజ్యామ్ - భక్త్యా నతా స్స్మ విదధాతు శుభాని సా నః ॥*_
ఈ జగత్తు నందంతటను వ్యాపించి ఉండునది, సర్వ దేవగణముల యొక్క మూర్తిరూపమైనది, సర్వదేవతల చేత, మహర్షులచేత ఆరాధింప దగినది అయిన ఆ అంబికకు మేము నమస్కరిస్తున్నాము. ఆ దేవి మాకు శుభముల నిచ్చుగాక !
_*యస్యాః ప్రభావ మతులం భగవా ననంతో - బ్రహ్మా హరశ్చ న హి వక్తు మలం బలం చ |*_
_*సా చండికా ఖిల జగత్పరిపాలనాయ - నాశాయ చాశుభభయస్య మతిం కరోతు ॥*_
చండిక యొక్క శౌర్య బలపరాక్రమాలు అద్వితీయమైనవి. వాటిని త్రిమూర్తులుకూడా వర్ణించలేరు. అటువంటి అసమానమైన శౌర్య పరాక్రమాలు గలిగిన ఆ చండీదేవి తన యొక్క మహిమ వలన లోకాలను పరిపాలిస్తూ, సర్వజీవులకు కూడా అమంగళము, భయము లేకుండా చూచునుగాక !
_*యా శ్రీ స్స్వయం సుకృతినాం భవనే ష్వలక్ష్మీః - పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః ।*_
_*శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా - తాం త్వాం సతా స్స్మ పరిపాలయ దేవి విశ్వమ్ ॥*_
ఆ పరమేశ్వరి పుణ్యపురుషుల ఇండ్లయందు సంపదగా, పాపాత్ముల ఇండ్లయందు అశుభముగా, విద్వాంసుల హృదయములందు బుద్ధిగా బుద్ధి అంటే ఇక్కడ 'జ్ఞానము' అని అర్థం. కాబట్టి విద్వాంసులకు జ్ఞానముగా, సత్పురుషుల హృదయముల యందు శ్రద్ధగా, సత్కుల సంజాతుల హృదయ ముల యందు లజ్జగా నిలిచి ఉంటుంది. అటువంటి దేవతామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఆమె ఈ జగత్తును పాలించుగాక!
_*కిం వర్ణయామ తవ రూప మచింత్య మేతత్ - కిం చాతివీర్య మసురక్షయకారి భూరి |*_
_*కిం చాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్యసురదేవగణాదికేషు ॥*_
ఓ పరమేశ్వరీ! నీయొక్క రూపము ఇది అని ఊహించటానికి కూడా వీలుకాదు. అది మా మనసులకు అందనిది. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో నీ శౌర్య పరాక్రమాలు వర్ణనాతీతము. దేవాసురసంగ్రామం జరిగేటప్పుడు నీవు చేసే అద్భుతాలు ఊహించటానికి కూడా అలవి కాదు. అటువంటి నీ గొప్పదనాన్ని మేము ఏ రకంగా వర్ణించగలము తల్లీ?
_*హేతు స్సమస్తజగతాం త్రిగుణాஉపి దోషైః - న జ్ఞాయసే హరిహరాదిభిర వ్యపారా - సర్వాశ్రయా ఖిల మిదం జగదంశభూత - మవ్యాకృతా హి పరమా ప్రకృతి స్త్వమాద్యా ॥*_
ఓ దేవీ ! సర్వ జగత్తులకు కారణము నీవే. నీవు త్రిగుణాత్మికవు. అయినప్పటికీ ఆ గుణములలోని దోషములు నీకు అంటవు. హరిహరాదులు కూడా నీ తత్త్వాన్ని తెలుసుకోలేరు. సర్వులకు నీవే అండవు. నీలోని కొంత భాగము నుంచే ఈ జగత్తు సృష్టించబడింది. నీవు అందరికన్నా అధికురాలవు. ఆద్య ప్రకృతివి.
ఇక్కడ చూడండి. ఇంద్రాది దేవతలు పరమేశ్వరిని స్తుతిచేస్తూ 'అమ్మా! సర్వజగత్తులకు నీవే కారణము' అంటున్నారు. ఇదే విషయాన్ని బృహదారణ్య కోపనిషత్తులో చెబుతున్నారు. ఈ సృష్టికి పూర్వము మకారంలో ఉన్న విరాడాత్మ మాత్రమే ఉన్నది. అదే పరమేశ్వర స్వరూపము. దానికన్న భిన్నమైనది ఏదీలేదు. ఆ తరువాత జగన్నిర్మాణం కోసం పరమేశ్వరుడు తనను తాను రెండుగా విభజించుకున్నాడు. ఆ భాగాలే స్త్రీపురుషులు. వారే స్వాయంభువ మనువు, శతరూప.
ప్రజాపతివల్ల కలిగిన 'శతరూప' కుమార్తెలతో రమించటం నిషిద్ధం కదా! తననుండి పుట్టిన నాతో ఈ ప్రజాపతి ఏ విధంగా రమిస్తాడు? ఎందుకయినా మంచిది అనుకుని తాను ఆవుగా మారింది. ఇది చూసిన పురుషుడు వృషభమైనాడు. గోసంతతి వర్థిల్లింది. శతరూప ఆడుగుర్రం అయింది. పురుషుడు మగ గుర్రం అయినాడు. అశ్వసంతతి వర్థిల్లింది. ఆమె ఆడుగాడిద అయింది. మనువు మగగాడిద అయినాడు. గార్థభ సంతతి వృద్ధి చెందింది. ఈ రకంగా శతరూప అనేక రూపాలుదాల్చింది. అసలు 'శతరూప' అంటేనే వందరూపములు గలది అని అర్థం. ఇక్కడ వంద అనేది సంఖ్యావాచకము కాదు. అనేకము అనే అర్థంలో వాడబడింది. ఈ రకంగా ఆ స్త్రీ అనేక రూపాలు ధరించింది. పిపీలికాది బ్రహ్మ పర్యంతము స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతా సృష్టించబడింది. జగత్తులోని 84 లక్షల రకాలైన జీవరాసి ఉత్పన్నమైంది. నారాయణోపనిషత్తులోని మొదటి అనువాకం చూడండి. సృష్టి ప్రారంభంలో పరమ పురుషుడైన నారాయణుడు ప్రాణులను సృష్టించాడు. అందులో ముందుగా హిరణ్యగర్భుడు పుట్టాడు. తరువాత పంచభూతాలు నారాయణుని నుంచే ఆవిర్భవించినాయి. ఆ తరువాత నారాయణుని నుండి బ్రహ్మ ఉద్భవించాడు. రుద్రుడుద్భవిం చాడు. ఆ నారాయణుని నుంచే ఇంద్రుడు జన్మించాడు.మరీచి, కశ్యపుడు మొదలైన ప్రజాపతులు ఆవిర్భవించారు.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[25/05, 07:02] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 16వ భాగం:*_
చతుర్వేదములు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు ఆవిర్భవించారు. ఈ రకంగా ఈ జగత్తంతా అతని నుండే సృష్టింపబడింది. అతడే పరమేశ్వరుడు అని చెప్పబడింది.
బహ్వ్యచోపనిషత్తులో "ఈ సృష్టికి ముందు ఆ పరమేశ్వరి ఒకతే ఉండేది. ఆమె నుంచే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సకల మరుద్గణాలు వచ్చినాయి. ఆ దేవి నుంచే దేవగరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య, నాగగణాలు ఆవిర్భవించినాయి. అండజములు, ఉద్భిజములు, జారజములు, స్వేదజములు, ఊష్మజములు అన్నీ పుట్టినాయి.
అండజములు - గ్రుడ్డునుంచి పుట్టేవి. పాములు, పక్షులు.
ఉద్భిజములు - విత్తనాల వలన భూమి నుంచి పుట్టే చెట్లుచేమలు.
జారజములు - స్త్రీ జనేంద్రియము నుంచి పుట్టేవి.
స్వేదజములు - చెమట, మలిన పదార్థాల వలన పుట్టేవి.
ఊష్మజములు - వెచ్చదనం వలన పుట్టేవి. క్రిమికీటకాలు.
ఈ రకంగా స్తావరజంగమాత్మకమైన జగత్తంతా ఆ పరమేశ్వరుని నుంచే ఆవిర్భవించింది. ఇక్కడ పరమేశ్వరుడు అన్నా పరమేశ్వరి అన్నా రెండూ ఒకటే. ఎందుచేతనంటే ఆ పరమేశ్వరతత్త్వానికి లింగభేదం లేదు. దేవీభాగవతంలో తారకాసుర సంహారం కోసం దేవతలంతా ఆ పరమేశ్వరిని పరిపరివిధాల ప్రార్థిస్తారు. అప్పుడు చైత్రశుద్ధనవమి శుక్రవారంనాడు ఆ' దేవి వారికి ప్రత్యక్షమైంది. ఆమె ఎలా ఉన్నది అంటే-?
_*కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్ విద్యుత్కోటి సమానాభమరుణం తత్సరం మహః నైవచోర్థంనతిర్వక్షనమధ్యే పరిజగ్రభత్ *_
_*ఆద్యంత రహితం తత్తు నహస్తా ద్యంగ సంయుతం నస్త్రీ రూపమధనానపుం రూపమధోభయమ్ ||*_
కొన్నివేలకోట్ల సూర్యుల కాంతులతో, చంద్రులచల్లదనంతో కొన్నికోట్ల మెరుపుతీగలు ఒక్కసారి ప్రకాశించినట్లుగా తళుక్కున మెరిసింది. దానికి పైన క్రింద మధ్యన అనేదిలేదు. ఆద్యంతాలు లేవు. కాళ్ళు, చేతులు, మొదలైన అంగాలు అసలే లేవు. అది స్త్రీ కాదు. పురుషుడు కాదు. అలా అని నపుంసకుడు అంతకన్నా కాదు. అంటే పరమేశ్వరతత్త్వానికి లింగభేదం లేదు. కాబట్టి పరమేశ్వర తత్త్వాన్ని చెప్పేటప్పుడు ఉన్నది అన్నా ఉన్నాడు అన్నా తేడా ఏమీ లేదు.
అయితే ఈ సృష్టి చెయ్యాలని సంకల్పించిన పరమేశ్వరుడు తన నుండి కొంతశక్తిని బయటకు పంపాడు. ఆ శక్తి త్రికోణరూపంలో ఉన్నది. అదే మహాయోని. ఆ యోని అనేది స్త్రీలింగం కాబట్టే ఆవిణ్ణి పరమేశ్వరి అంటున్నాము. ఈ జగత్తంతా మహాయోని అంటే ఆ పరమేశ్వరి నుంచే ఆవిర్భవించింది. అందుకే దేవతలంతా 'అమ్మా! సర్వజగత్తులకు కారణము నీవే' అంటున్నారు. దేవతలు చెబుతున్నారు. ఓ దేవీ! నీవు త్రిగుణాత్మికవు. త్రిగుణాలు అంటే సత్వరజస్తమోగుణాలు. ఈ మూడు గుణాలతోనే జగత్తంతా నిర్మించబడింది. అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు లలితా సహస్రంలో 264వ నామం 'సృష్టికర్తీ' పూర్వకల్పంలోని జీవరాసుల కర్మవాసనలే 'మాయ' అనబడుతుంది. ఇది జడము. అందుకనే పరమేశ్వరుని యందు అభివ్యక్తమవుతుంది.
సృష్టి చెయ్యటమనేది రజోగుణధర్మం. ఆ పరమేశ్వరి మూలప్రకృతి రూపం పొంది ఈ సృష్టిని చేస్తున్నది. మాయనుంచే త్రిగుణాలు ఆవిర్భవించినాయి. ఈ త్రిగుణాల ఆధారంగానే సృష్టి జరుగుతున్నది. అందుచేతనే సృష్టి మూడు విధాలు.
1. ఏకగుణసృష్టి
2. ద్విగుణసృష్టి
3. త్రిగుణసృష్టి.
(దీనిమీద వివరాలకోసం నేను వ్రాసిన 'శ్రీవిద్యాసారధి’ లలితాసహస్రనామభాష్యంలోని 417వ పేజీలో 264వ నామం చూడండి.)
త్రిగుణములు ఆ దేవి నుంచే ఆవిర్భవించాయి కాబట్టి ఆమె త్రిగుణాత్మిక. అయినప్పటికీ గుణాలవలన వచ్చే దోషాలు ఏవీ ఆమెనంటవు.
ఆమె యొక్క శక్తిని హరిహర బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు. శంకరభగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో.. ప్రభవతి.
"ఓ భగవతీ! సర్వమంగళ సహితుడైన ఈశ్వరుడు కూడా నీతో కూడితేనే కాని ఈ జగత్తును నిర్మించటానికి సమర్థుడు కాడు. నీవు లేకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. నీ తత్త్వము ఏమిటో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదు. అటువంటి నిన్ను పూజించాలన్నా, నీకు నమస్కరించాలన్నా పూర్వజన్మకృతము ఉండాలి కదా!”
పరమేశ్వరి తత్త్వము అనేది హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదు. సృష్టిలో మొదటగా వచ్చినవాడు బ్రహ్మ. ఆ తరువాత విష్ణువు. రుద్రుడు. వారే త్రిమూర్తులు. సనాతనులు. వీరికే ఆ దేవిని గురించి తెలియదు అంటే ఇంకెవరికి తెలుస్తుంది?
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[26/05, 07:09] +91 90147 09041: _*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 17వ భాగం:*_
ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "ఇలాంటి విషయాలు చెప్పటానికి స్థితికారకుడైన విష్ణుమూర్తి ఉన్నాడు. అతన్ని ప్రార్థించినట్టైతే తరుణోపాయం చెప్పగలడు" అన్నాడు. ప్రజాపతి సలహామీద దేవతలంతా విష్ణులోకానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్ధించారు. దేవతల ప్రార్థనలాలకించిన విష్ణుమూర్తి “దేవతలారా! భూలోకంలో బ్రాహ్మణులు క్షత్రియులు చేసే యజ్ఞయాగాలకు సంబంధించిన హవ్యము మీ ఆకలిని పోగొడుతుంది. ఆ హవ్యము మీపేరు చెప్పి అగ్నిలో వేస్తారు. కాబట్టి దాన్ని అగ్ని మూలాన మీకు అందించే శక్తి వేరే ఉన్నది. ఆ శక్తి కోసం మీరంతా ఆ పరదేవతను ఆరాధించండి. ఆవిడ ప్రపన్నురాలైతే ఆ శక్తిని పంపుతుంది" అన్నాడు.
దేవతలంతా పరమేశ్వరిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆరాధించారు. దేవి వారి దీక్షకు మెచ్చి ఆ శక్తిని పంపింది. బ్రహ్మ ఆ శక్తికి నమస్కరించి "తల్లీ ! నువ్వు అగ్నికి వాహకశక్తివై ఉండి, అతని యందు హోమం చేసిన హవ్యాన్ని దేవతలకు అందించు" అన్నాడు. దానికి ఆ శక్తి “నేను శ్రీహరికే చెందుతాను తప్ప ఇతరులకు చెందను. కాబట్టి అగ్నికి దాహకశక్తిగా ఉండను" అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయింది.
ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఆ శక్తియొక్క తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై “దేవీ! నీ మనసు నాకర్థమయింది. వచ్చే జన్మలో నగ్నజితి అనే రాజు యొక్క కుమార్తె 'నాగ్నజితి'గా జన్మించి, నా అంశతో పుట్టిన శ్రీకృష్ణుని వివాహమాడవలసినది. కాని ఈ జన్మలో మాత్రం 'స్వాహా' అనే పేరుతో అగ్నిదేవుని ఇల్లాలివి కావలసింది" అన్నాడు. చేసేదిలేక సరేనంది స్వాహాదేవి. అగ్నిదేవుడికీ, స్వాహాదేవికీ వివాహం జరిగింది.
వారికి ముగ్గురు సంతానం కూడా కలిగారు. వారే...
1. ఆహవనీయాగ్ని
2. గార్హపత్యాగ్ని
3. దక్షిణాగ్ని.
ఈ రకంగా స్వాహాదేవి యొక్క అనుజ్ఞవల్ల దేవతల ఆకలి తీరింది.
పితృదేవతల శ్రాద్ధకర్మలో తర్పణము ద్వారా ఆహారం లభించేటట్టు చేశాడు బ్రహ్మ. కాని వారికి ఆహారం సక్రమంగా అందటం లేదు. పితృదేవతలంతా బ్రహ్మ దగ్గరకు పోయి వారి బాధలు చెప్పుకున్నారు. వారి బాధలు తీర్చటానికి బ్రహ్మ పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఒక కన్యను సృష్టించాడు. ఆమె పేరు స్వధ.
ఆమెను పితృదేవతలకు సమర్పించాడు. శ్రాద్ధకర్మలో పితృదేవతలకు సమర్పించిన దానిని వారికి సవ్యంగా అందించటమే ఈమె పని.
ఈ రకంగా దేవతలకు ఆహుతులందించే స్వాహాదేవి, పితృదేవతలకు తర్పణలందించే స్వధాదేవి ఇద్దరూ కూడా పరమేశ్వరి ప్రతిరూపాలే. అందుకే జనులు ఆ దేవిని స్వాహా అని, స్వధా అని కూడా అంటారు.
_*యా ముక్తి హేతు రవిచింత్యమహావ్రతా త్వ - మభ్యస్యసే సునియతేంద్రియ తత్త్వసారైః | మోక్షార్థీభిర్మునిభి రస్తసమస్తదోషైః - విద్యా. సీసా భగవతీ పరమా హి దేవీ ॥*_
ఓ దేవీ ! నీవు భగవతివి. మోక్ష హేతువువు. మహా తపస్సంపన్నులు కోరుకునే పరావిద్యవు. మోక్షాన్ని కోరేవారు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవారు, నీయొక్క తత్త్వము తెలిసికొనుట యందు ఆసక్తి గలవారు, దోషరహితులు అయిన మునులు పరావిద్యవైన నిన్ను అభ్యసిస్తారు. అంటే సాక్షాత్తూ పరమేశ్వరియే 'పరావిద్య' అంటున్నారు. అసలు పరావిద్య అంటే ఏమిటి?
ముండకోపనిషత్తులో శునకుని కుమారుడైన శౌనకుడు తన గురువైన అంగిరస మహర్షి దగ్గరకు వెళ్ళి "గురువర్యా ! దేన్ని గురించి తెలుసుకుంటే సర్వమూ తెలుస్తాయో ఆ విషయాన్ని దయచేసి నాకు వివరించండి” అన్నాడు. ఆ మాటలు విన్న అంగిరసుడు చెబుతున్నాడు:
“నాయనా! లోకములో మనం తెలుసుకోవలసిన విద్యలు రెండున్నాయి. 1. పరావిద్య 2. అపరావిద్య. వేదాలలో ఈ రెండు విద్యలే చెప్పబడ్డాయి. ముందుగా అపరావిద్యను గురించి వివరిస్తాను.
అపరావిద్య అనేది లౌకిక ప్రయోజనాలకు ఉపకరిస్తుంది. బుద్ధిసంపన్నులైన మహర్షులు వేదాలలో స్వర్గసాధనా లయిన యజ్ఞకర్మలను కనుగొన్నారు. కర్మాచరణపరాయణులు, కర్మవాదులు అందరూ ఆ కర్మలనాచరించి సత్ఫలితాలు పొందారు. కర్మ ఫలాన్ని ఆచరించే వారందరూ అపరావిద్యను ఆశ్రయిస్తారు. చతుర్వేదాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, సంగీతము, సాహిత్యము అన్నీ అపరా విద్యకు సంబంధిచినవి. వీటివల్ల మానవుడు లోకంలో గౌరవం పొందుతాడు, ఉన్నత పదవులు పొందుతాడు. ధనధాన్యాలు భోగభాగ్యాలు, స్వర్గసుఖాలు పొందుతాడు.
వేదాలలో యజ్ఞయాగాదికర్మలు చెప్పబడ్డాయి. ఈ కర్మలను ఆచరిస్తే ఫలితం వస్తుంది. ఈ రకంగా సంసార సుఖాలనుభవించటానికి కావలసిన ధనము, పలుకుబడి లభిస్తాయి. అపరావిద్య ధర్మాధర్మాలు, పుణ్యపాపాలతో మిళితమై ఉంటుంది. వేదవేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నీ అందులోని భాగాలే. ఈ అపరావిద్యవల్ల జన్మ, జరా, మృత్యు భయం పోదు. ప్రపంచంలో చాలామంది ధనము, కీర్తి, పదవి కావాలని ఇష్టపడతారు. స్వర్గసుఖాలు కావాలని కోరుకుంటారు.
వీరందరూ అపరా విద్యను ఉపాసిస్తారు. వీరు విషయవాంఛలలో పడి సతమతమవుతుంటారు. అంతే కాని వీరికి మోక్షం మాత్రం రాదు.పరావిద్య అనేది మోక్ష విద్య. జ్ఞానేంద్రియాలకు లొంగనిది, కర్మేంద్రియాల విషయంకానిది, గోత్రము, వర్ణము, నేత్రములు, శ్రోత్రములు, కాలుచేతులు లేనిది, నిత్యమైనది, సర్వాత్రావ్యాపించి ఉండునది, సూక్ష్మాతి సూక్ష్మమైనది, అవ్యయమైనది, పంచభూతాలకు కారణమైనది, పరబ్రహ్మ తత్త్వము. అటువంటి తత్త్వాన్ని జ్ఞానియైన వాడు సర్వత్రా చూడగలడు. అటువంటి పరతత్త్వాన్ని గూర్చి బోధించేదే పరావిద్య. పరావిద్యవల్ల ఆత్మానుభవము, బ్రహ్మలోకప్రాప్తి కలుగుతాయి. మోక్షం సిద్ధిస్తుంది.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
[26/05, 08:25] +91 82472 88131: 🙏లింగాష్టకం🙏
🔱 *బ్రహ్మ మురారి సురార్చిత లింగం*
🔔బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!
🔱 *నిర్మలభాసిత శోభిత లింగం*
🔔నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!
🔱 *జన్మజ దుఃఖ వినాశక లింగం*
🔔జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదాశివ లింగం*
🔔ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!
🔱 *దేవముని ప్రవరార్చిత లింగం*
🔔దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!!
🔱 *కామదహన కరుణాకర లింగం*
🔔మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!
🔱 *రావణదర్ప వినాశన లింగం*
🔔రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
🔱 *సర్వ సుగంధ సులేపిత లింగం*
🔔అన్ని మంచి గంధాలు పూసిన శివ లింగం..!!
🔱 *బుద్ధి వివర్ధన కారణ లింగం*
🔔మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!
🔱 *సిద్ధ సురాసుర వందిత లింగం*
🔔సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
🔱 *కనక మహామణి భూషిత లింగం*
🔔బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!
?
🔱 *ఫణిపతి వేష్టిత శోభిత లింగం*
🔔నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!
🔱 *దక్ష సుయజ్ఞ వినాశక లింగం*
🔔దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
🔱 *కుంకుమ చందన లేపిత లింగం*
🔔కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!
🔱 *పంకజ హార సుశోభిత లింగం*
🔔కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!
🔱 *సంచిత పాప వినాశన లింగం*
🔔సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
🔱 *దేవగణార్చిత సేవిత లింగం*
🔔దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!
🔱 *భావైర్భక్తీభిరేవచ లింగం*
🔔చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!
🔱 *దినకర కోటి ప్రభాకర లింగం*
🔔కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
🔱 *అష్ట దళోపరివేష్టిత లింగం*
🔔ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!
🔱 *సర్వ సముద్భవ కారణ లింగం*
🔔అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!
🔱 *అష్ట దరిద్ర వినాశక లింగం*
🔔ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
🔱 *సురగురు సురవర పూజిత లింగం*
🔔దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!
🔱 *సురవన పుష్ప సదార్చిత లింగం*
🔔దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!
🔱 *పరమపదం పరమాత్మక లింగం*
🔔ఓ శివ లింగమా, నీ సన్నిధియే ఒక స్వర్గము
🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం*
🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
🔱 *లింగాష్టక మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ*
🔔ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!
🔱 *శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే*
🔔శివ లోకం లభిస్తుంది ..!!
శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది🙏
_*🔱శ్రీ దుర్గా "సప్తశతీ" భాష్యము:🔱*_
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
_*👉 20వ భాగం:*_
నాయనా! కొన్ని వేల కుండలు తయారు చేసినప్పటికీ, ఆ కుండ లన్నింటికీ మూలము మట్టి అయినట్లుగానే దృశ్యరూపమైన ఈ ప్రపంచానికి శాశ్వతమైన ఒక దివ్యశక్తి మూలమై ఉన్నది ఆ కుండలన్నీ మట్టిలోనే పుట్టి, మట్టిలోనే పెరిగి, చివరకు మట్టిలోనే కలిసిపోతాయి.
అలాగే ఈ ప్రపంచం కూడా పరమేశ్వరుని కృపతో సృష్టించబడింది. ఈశ్వరుని వల్లనే రక్షింపబడుతున్నది. చివరకు ఆ ఈశ్వరునిలోనే లీనమపుతున్నది. ఈ రకంగా సృష్టిస్థితిలయాలకు ఆధారమైన సర్వవ్యాపి, శుద్ధచైతన్యమే ఓంకారము. ప్రపంచాన్ని ఒక శబ్దం ద్వారా సూచిస్తే, ఆ శబ్దమే ఓంకారము. ప్రతివస్తువుకు ఒక రూపం ఉంటుంది ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది. ఈ జగత్తు అనే పరబ్రహ్మకు నామమే ఓంకారము.
_*భూతంభవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ మచ్ఛాన్యతుత్రికాలాతీతం తదస్యోంకారమేవ*_
భూత భవిష్యద్వర్తమానకాలాలు మూడూ ఓంకారమే. త్రికాలము లకు అతీతమైనది ఏదైనా ఉంటే, అది కూడా ఓంకారమే.
ఓంకారమనేది సమస్తలోకాలకు ప్రతీక. సమస్త జగత్తులకు ప్రతీక. పరమేశ్వరుడు దృశ్యరూపమయితే శబ్దం ఓంకారమవుతుంది. అక్కడ చిన్న అనుమానం వస్తుంది. పరమేశ్వరుడు త్రికాలములకు ప్రతీక అన్నారు. బాగుంది. కాలాతీతమైన దాంతో ఆయనకు సంబంధం ఏమిటి? అని అంటే పరమేశ్వరుడు పరిమితమైన డానికే కాదు అపరిమితమైన దానికి కూడా ప్రతీకయే. అందుకనే త్రికాలాలకే కాదు, కాలాతీతమైన దానికి కూడా ప్రతీక.
కాలజ్ఞానమనేది మనసు యొక్క ఇంద్రజాలం. మనసు లేకపోతే కాలం ఉండదు. మనసు జడము, అచేతనము. అటువంటి అచేతనమైన మనసు జీవము పొందినట్లైతే చేతనమవుతుంది. జీవము పొందిన మనసు చలిస్తుంది. చలనవంత మవుతుంది. కాబట్టి త్రికాలాతీతమైనది ఆ దివ్యచైతన్యము తప్ప వేరుకాదు. దానివల్లనే ఈ శరీరంలోని మనసు, బుద్ధి కూడా పనిచెయ్యగలుగుతున్నాయి. ఆ చైతన్యమే ఓంకారము.
'ప్రశ్నోపనిషత్తు'లో సత్యకాముడు పిప్పలాద మహర్షికి నమస్కరించి “మహర్షీ మానవుడు మరణించేదాకా ఓంకార ధ్యానం చేసినట్లైతే ఏ లోకాలకు పోతాడో వివరించండి" అని అడుగుతాడు. దానికి పిప్పలాదుడు "సత్యకామా! ఓంకార మనేది పరబ్రహ్మము అపరబ్రహ్మము కూడా.
పరబ్రహ్మము అంటే సర్వాతీతమైన నిర్గుణబ్రహ్మ. అపరిబ్రహ్మము అంటే సాకారము, వ్యక్తరూపం గల హిరణ్యగర్భుడు. అందుచేత పండితులు జ్ఞానులు ఓంకారాన్నే ధ్యానిస్తారు.
ఓంకారము నాదబ్రహ్మము. దీన్నే ప్రణవము అంటారు. దీన్నుంచే సమస్త శబ్దాలు, మంత్రాలు ఉత్పన్నమయినాయి. అందుకనే ఓంకారము సర్వ మంత్రాలకు హేతువు.
సగుణ బ్రహ్మను ఓంకారంతో ఉపాసించవచ్చు. అలాగే అవ్యక్తమైన పరబ్రహ్మను శబ్దంతో సూచించటానికి ఓంకారమే గుర్తు. ఓంకారంలో అకారఉకారమకారాలనే మూడక్షరాలున్నాయి. ఓంకారమనేది మూడువేదాలకు ప్రతీక. ఇందులోని...
అకారము - ఋగ్వేదము
ఉకారము - యజుర్వేదము
మకారము - సామవేదము
వేదపురుషుడు పరబ్రహ్మ స్వరూపమే. అందుచేతనే ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. దీనిని ఉపాసించినవాడు జీవితంలో సర్వసుఖాలు అనుభవించి, అంత్య కాలంలో మోక్షం పొందుతాడు" అని చెబుతాడు.
'అధర్వశిఖోపనిషత్తు'లో పిప్పలాదుడు, అంగిరసుడు, సనత్కుమారుడు అనేవారు ముగ్గురూ అధర్వణముని దగ్గరకు వెళ్ళి “సృష్టిసమయంలో బ్రహ్మాది దేవతలు ఏం ఉపయోగించారు? ధ్యానమంటే ఏమిటి? ధ్యానింపతగినది ఏది? ధ్యానానికి సాధనము ఏది? మాకు తెలియజేయండి" అని అడుగుతారు. దానికి అధర్వణముని “నాయనలారా! ప్రణవాక్షరమే మొదటగా ఉపదేశించబడింది. అదే ధ్యానము. ఆ ప్రణవాన్నే ధ్యానించాలి. ప్రణవము అనేది పరబ్రహ్మ స్వరూపము. దీనికి నాలుగుపాదాలు లేదా నాలుగుమాత్రలుంటాయి. ఈ నాలుగు పాదాలే నాలుగు వేదాలు. దీనిలో...
మొదటిమాత్ర - అకారము. ఋగ్వేదము.
దీనికి భూతము - పృథివి
అధిదేవత - బ్రహ్మ
ఛందస్సు - గాయత్రి
రెండవమాత్ర - ఉకారము. యజుర్వేదము
దీనికి భూతము - ఆకాశము
అధిదేవత - విష్ణువు
ఛందస్సు - త్రిష్టప్
మూడవ మాత్ర - మకారము. సామవేదము
దీనికి భూతము - స్వర్గము
అధిదేవత - రుద్రుడు
ఛందస్సు - జగతిఛందస్సు
అలాగే నాల్గవమాత్ర - అర్థమాత్ర. అధర్వణవేదము
దీనిభూతము - సోమలోకము
అధిదేవత - విరాట్టు
అకార ఉకార మకారములకు చివర ఉండే సూక్ష్మమైనది అర్ధమాత్ర. ఇదే నాదము.
ఒక్కసారి ప్రణవాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే ఉత్తమస్థానాలు లభిస్తాయి. పరమపదము లభిస్తుంది అంటూ వివరిస్తాడు. కాబట్టి ఓంకారము అంటే పరబ్రహ్మ స్వరూపమే కాని వేరుకాదు. అందుకే ఇంద్రాది దేవతలు పరమేశ్వరిని స్తుతిచేస్తూ "అమ్మా! నీవు శబ్దబ్రహ్మకు ఆత్మవంటి దానవు" అంటున్నారు అంటే తల్లీ! నీవే సృష్టిస్థితిలయాలకు అతీతమైన పరమేశ్వర స్వరూపానివి అని అర్థం.
_*రేపటి భాగంలో మల్లి కలుసుకుందాం...*_
_*శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️