Tuesday, December 10, 2024

Learning Sources

 https://www.eenadu.net/telugu-news/antaryami/general/1100/124215489




భాషా క్రీడ: అసమాపకక్రియ

శ్రీ రామ రాజ్యము శ్రీరస్తు పలికించ, రాముడు కౌసల్యాదేవి గర్భంబున జన్మించి,దశరథనందుడిగా వెలుగొంది,సకలవిద్యలను ఆపోశన పట్టి, సోదర భావంతో ఉండి,విశ్వామిత్ర మహర్షి యాజ్ఞ తో యజ్ఞ రక్షణ చేసి,శివ ధనుస్సు విరిచి, సీతనుపరిణయమాడి, తండ్రి మాటకై అడవులకేగి,రావణుని చంపి, రాజధర్మమెరిగి,విధి యాడినట్టి, వింత నాటకమున భగవత్సకల్పoగ పత్ని నిడిచి,ఎన్నియో కష్టము లెదురించి, తానును కర్మ ఫలిత మొంది, పత్నిని హృదిలోన పదిలపరుచుకుంటు, మంచి ప్రభువుగా ప్రజలనుపాలించి,సద్గుణములనెన్నో తీర్చిదిద్దుకొని,సత్ససంపదనంత

ముందుతరములకునుయoదియిచ్చి,మానవాళికి మార్గ దర్శకుడయ్యి,మహిలోన మంచి కీర్తి గడించి, కలియుగంలో బాల రాముని గా ఏ తెంచి......





తెలుగుభాషలో అరసున్న ఉన్నది. కానీ, దానికి ఉచ్చారణ లేదు. 


 *"అట్టి పదములను కేవలము లిపిలో చూపించి, భేదము తెలిపినచో ప్రయోజనము లేనిదని నా భావన."*


మీయొక్క ఈ అభిప్రాయం తప్పు. విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.




🌹🌹అరసున్నా..గురించి


విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.













*ఒక తమిళ వ్యక్తి రాసిన✒️ వ్యాసాన్ని యధాతధంగా.....*


నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.


*తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారో ! తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.*


*1.తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి వుంది.*


2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపి గా కొరియన్ భాష.


3. *తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది.* మిగిలన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.


4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.


5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.


6. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాష లో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి చెందిన *నికోలో డీ* అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను "*ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్*” అని అంటారు .


7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానాన్ని పొందింది.


8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. పురాణాల ప్రకారం త్రిలింగక్షేత్రాలు నైజాం ప్రాంతంలోన రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరం ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.


9. *ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.*


*10. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు ఇంక ఏ భాషలోనూ లేవు.*


11. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.


12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.


13. 200 సం.ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు *మారిషస్* వెళ్ళారు. ప్రస్తుత *మారిషస్ ప్రధాని* వారి సంతతే.


14. *కచిక పదాలతో* కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలో కూడా లేదు.

*కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.*


15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి, "*దేశభాషలందు తెలుగు లెస్స*” అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో *అధికార భాష* గా చేసాడు.


16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాషా ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

పై విషయాలు అన్నీ ఒక తమిళ వ్యక్తి ఆంగ్లంలో తెలియజేసిన విషయాలను అనువదించారంటే నమ్మశక్యంగా లేదు. *కానీ ఇది నిజం.* ఇంత గొప్ప మన భాషను మన భావి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం వుండకూడదని నా భావన. 

*ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు.* *కానీ అది ఏమి దౌర్భాగ్యమో !ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో !గానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యతిస్తాం* *అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం.* ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడుదాం. 

*ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి.* అందుకోసం మన తెలుగు భాషను బలి చేయ నవసరం లేదు. 


*తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం.*


మీకు తెలుగు భాష పై మమకారం ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేయండి.





తెలుగుభాషలో అరసున్న ఉన్నది. కానీ, దానికి ఉచ్చారణ లేదు. 


 *"అట్టి పదములను కేవలము లిపిలో చూపించి, భేదము తెలిపినచో ప్రయోజనము లేనిదని నా భావన."*


మీయొక్క ఈ అభిప్రాయం తప్పు. విద్యాభ్యాసంలో తెలుగుభాష, తెలుగు వ్యాకరణాలు అంశాలుగా చదువుకోని వారికి అరసున్న గురించి పెద్దగా తెలియదు. 


అరసున్న రెండు రకాలుగా ఉంటుంది. 

1. పదగతమైనది. అనగా వ్యాకరణసూత్రాల వలన ఏర్పడకుండా సహజంగా పదంలోనే ఉంటుంది. ఉదా:- అఁట, ఇఁక, రాముఁడు ఈవిధంగా. 

2. వ్యాకరణసూత్రాలవలన (వ్యాకరణసాధ్యమైనది) ఏర్పడినది. 

వ్యాకరణభాషలో "ద్రుతము" అనేది ఒకటి ఉన్నది. "ద్రుతాఖ్యో నః" అని నిర్వచనము. అంటే "నకారము ద్రుతము అనబడుతుంది" అని అర్థము. "ని,ను,న్" ఈ మూడు నకారాలూ ద్రుతముగా పరిగణించబడతాయి. 


ద్రుతము అనగా కరగిపోవునది. అని అర్థము. ఈ ద్రుతముగా చెప్పబడిన నకారములు తరువాత పరుషము(కచటతప)లు వస్తే ఆ పరుషములు సరళములు(గజడదబ)లుగా మారతాయి. ముందున్న ద్రుతము అరసున్నగా మారుతుంది. ఉదా: వానిన్+చూచి=వానిఁజూచి. ఈ విధంగా అనేక పదాలు మనకు కనబడతాయి. 


ద్రుతం తరువాత సరళాలు ఉన్నట్లైతే ఆ సరళాలు అలాగే ఉండి ద్రుతము అరసున్నగా మారుతుంది. 


ద్రుతము తరువాత స్థిరాక్షరాలు ఉన్నట్లైతే స్థిరములు ఏవిధంగానూ మారవు. ద్రుతం లోపించిపోవటమో లేదా సంయుక్తంగా మారటమో జరుగుతుంది. ఇక్కడ అరసున్నగా మారదు. 


ఆ విధంగామారిన అరసున్న వలన ముందటి పదము ద్రుతాంతమని మనకు తెలుస్తుంది. మీరన్నట్లు అరసున్న అనవసరము అన్నట్లైతే....

కనియెన్+జాబిల్లి=కనియెఁజాబిల్లి 

ఇందులో 

అరసున్నను తొలగిస్తే (మీమాట ప్రకారం)

కనియెజాబిల్లి అని ఉంటుంది. 

ఇందులో జాబిల్లిలో "జా" పదగతసరళమా? వ్యాకరణసాధ్యమైన సరళమా? తెలుసుకోవటం కుదరదు. 


భాషలో అరసున్నకు ఉచ్చారణ లేకపోయినా దానియొక్క ప్రయోజనము చాలా ఉన్నది. 


ప్రస్తుతభాషాపండితులకన్నా మనకు వ్యాకరణాలను రచించి భాషకు ఒక మార్గాన్ని చూపిన మన పూర్వ లాక్షణికులు (వ్యాకరణవేత్తలు) ఎన్నో విధాలుగా ఆలోచించి, భాషను పరిశోధించి వ్యాకరణ సూత్రాలను, భాషకు నిబంధనలను ఏర్పరచటం జరిగింది ఈ విషయాన్ని మనం గుర్తించాలి.








మీరు చెప్పిన దానిని బట్టి.,

గద్యం/వచనంలో దండకానికి ఛందస్సు(తగణ ప్రయుక్తము) ఉన్నది. ఆ సందర్భాలలో ఁ తో గురువు/లఘువు గా చేసుకునే సౌలభ్యం కోసమే ఁ ఉన్నది.


ఌౡ ల వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.

ౡత, కౢప్తము, భౡౢకము మొ॥


అలాగే ఱర లకు వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.


ఇప్పటికీ ళ ల, శ ష స - ల భేదము/వినియోగము/ఉచ్చారణ ఉన్నవి.


నేను ఇప్పటికీ అనేది ఒక్కటే . ఁ కు ఒకానొక కాలంలో ఉచ్చారణ ఉండి ఉంటుంది. దరిమిలాను, ఆ ఉచ్చారణను వదలిపెట్టి కేవలం వ్యాకరణ సూత్రములకే ఁ ను పరిమితం చేశారని నా మాట.

అందుకనే ఉచ్చారణ చూపకుండా ఁ తో పదములను చూపించడం మ్యూజియం ప్రదర్శన మాత్రమే అని నాఅభిప్రాయం.



మీరు ఉటంకించిన వాటిలో నేను చెప్పిన అంశములు వున్నవి.

దండకమును వచనముగా నేను పేర్కొనేదు. గద్యము వేరు వచనము వేరు. పద్యగద్యాలకు మధ్యస్థముగా దండకము ఉన్నది.

మొదటి నుండి నేను చెపుతున్నది ఒకటే, ఁ కు ఉచ్చారణ ఉండాలి అని. అలా ఉచ్చారణ లేనపుడు ఁ ఉన్న/లేని పదముల నడుమ వ్యత్యాసమును కేవలం లిపిలోనే చూడడం మ్యూజియం మాత్రమే.

స్వస్తి.







ఓం శ్రీమత్రే నమః.🙏🏼


నారుమంచి వేంకట అనంత కృష్ణ చిత్రముపై

నా పద్యము.

👇🏼

అనేక కంద గీత గర్భ చంపకమాల.

👇🏼

చం. వరగుణుఁడే గనన్ నయ సువర్తన రూపమె నారుమంచిరా,

నెర గనియేగనన్ నటన నేరని మూర్త్యన నారుమంచిరా,

స్థిర మణియౌమహోన్ నత సుధీర నరుండన నారుమంచిరా,

ధర ఘృణియే లసన్ నవ సుధాప్రణవాంబుధి నారుమంచిరా.


చంపక గర్భస్థ కందము 1

👇🏼

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,

మణియౌమహోన్ నత సుధీ

ర నరుండన నారుమంచిరా, ధర ఘృణియే.


చంపక గర్భస్థ కందము 2

👇🏼

మణియౌమహోన్ నత సుధీ

ర నరుండన నారుమంచిరా, ధర ఘృణియే.

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,


చంపక గర్భస్థ కందము 3

👇🏼

గనియేగనన్ నటన నే

రని మూర్త్యన నారుమంచిరా, స్థిర మణియౌ

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.


చంపక గర్భస్థ కందము 4

👇🏼

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.

గనియేగనన్ నటన నే

రని మూర్త్యన నారుమంచిరా, స్థిర మణియౌ


చంపక గర్భస్థ కందము 5

👇🏼

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.


చంపక గర్భస్థ కందము 6

👇🏼

ఘృణియే లసన్ నవ సుధా

ప్రణవాంబుధి నారుమంచిరా.వరగుణుఁడే.

వరగుణుఁడే గనన్ నయ సువ

ర్తన రూపమె నారుమంచిరా, నెర గనియే,


చంపక గర్భస్థ తేటగీతి.

👇🏼

నయ సువర్తన రూపమె నారుమంచి

నటన నేరని మూర్త్యన నారుమంచి

నత సుధీర నరుండన నారుమంచి

నవ సుధాప్రణవాంబుధి నారుమంచి.


అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.





[30/12, 20:07] +91 99635 50478: *చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు..*


తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన


స్వర రచన,గానం. డా|| శోభారాజ్ 

రాగం. హంసధ్వని


రేకు: 8-4

సంపుటము: 1-52

రేకు రాగము: శ్రీరాగం


చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు

చాలదా హితవైన చవులెల్ల నొసఁగ


ఇదియొకటి హరినామ మింతైనఁ చాలదా

చెదరకీ జన్మముల చెఱలు విడిపించ

మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా

పదివేలు నరకకూపముల వెడిలించ


కలదొకటి హరినామ కనకాద్రి చాలదా

తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ

తెలివొకటి హరినామ దీపమది చాలదా

కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల


తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా

జగములో కల్పభూజంబు వలెనుండ

సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా

నగవుఁచూపులను ఉన్నతమెపుడుఁ చూప

[30/12, 20:07] +91 99635 50478: *చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు..*


విశ్లేషణ:


- శ్రీ తాడేపల్లి పతంజలి గారు


ముఖ్య పదార్థము:



*సౌఖ్యామృతము దమకు* = సౌఖ్యామృతము + తమకు


*సౌఖ్యామృతము* = సుఖమనెడి అమృతము


*చవులెల్లనొసఁగ* = చవులు + ఎల్లన్ ఒసగ


*చవులు* = 1.రుచి, 2.ప్రేమ, 3.ఆశ, 4. అనుభవము, 5.సౌఖ్యము, 6.ప్రియము


*హరినామ మింతైన జాలదా* = హరినామము + ఇంతైనన్ + చాలదా


*చెదరకీ జన్మముల* = చెదరకు + ఈ జన్మముల


*చెఱలు* = 1. కారాగారము 2. బాధ 3. నిర్బంధము


*మది నొకటి* = మదిన్ ఒకటి


*హరినామమంత్ర మది* = హరినామమంత్రము + అది


*కనకాద్రి* = కనక+అద్రి = బంగారుకొండ, మేరువు


*చెఱుచ* = నశింపజేయుటకు, పోగొట్టుటకు


*కలుషపు* = మాలిన్యపు, పాపపు


*కఠిన* = క్రూరమైన, దయలేని, పరుషమైన


*పార ద్రోల* = పారన్+త్రోల


*కీర్తన మొకటి* = కీర్తనము + ఒకటి


*సొగిసి* = సుఖించి


*కరుణ చాలదా* = దీనము, దైన్యము చాలదా!


*నగవు జూపులను* = నగవున్ + చూపులను


*ఉన్నత మెపుడుఁ జూప* = ఉన్నతమెపుడున్ + చూప


*భావము:*


     ఈ ప్రపంచంలో ఏవేవో చాలలేదనుకొంటాము. కొన్నింటిని రాజీపడుతూ సరి పెట్టుకొంటాం. హరినామ సౌఖ్యామృతము మనకు సరిపోతుందని అన్నమయ్య ఒక గురువుగా ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నారు.


     శ్రీ హరి నామ సుఖమనెడి అమృతము మీకు చాలదా? అంతకంటే రుచిని (ప్రేమ, ఆశ, అనుభవము, సౌఖ్యము, ప్రియము) ఇచ్చేది వేరే ఉందా?(హరినామమే గొప్పదని భావము).


1. ఈ జన్మముల కారాగారము విడిపించుటకు హరినామము ఇంతైనా (కొద్దిగానయినా అనగా మనస్సు పెట్టి కొద్దిసేపు భజించినా చాలని భావము) చాలదా!? పదివేల నరక కూపములను పోగొట్టుటకు హరినామ మంత్రము మదిలో తలచిన చాలదా!? గర్భావాసము నరక కూపము. ప్రతి జన్మ గర్భ శోకాన్ని జీవునకు కలిగిస్తుంది. ఆ నరక సదృశమైన గర్భావాసమును తొలగించుకొనుటకు హరి నామము జపించుమని అన్నమయ్య సందేశము. 


2. దరిద్ర దోషమును తొలగించుటకు బంగారుకొండవంటి హరినామము ఒకటి చాలదా!? పాపాల కఠిన కటిని పారద్రోలుటకు హరినామ దీపము సరిపోదా!?


3. భూమిలో కోరినది ప్రసాదించే కల్ప వృక్షమువలె నుండుటకు వేంకటేశుకీర్తన మొక్కటి చాలదా! ( వేంకటేశు కీర్తనము కల్ప వృక్షమువంటిదని భావము. ) నగవు చూపులతో ఉన్నతత్వమును ఎపుడూ చూపుటకు ఈ వేంకటేశవిభుని దాసులైన భక్తుల కరుణ చాలదా?! ( వారి కరుణ నగవు చూపులతో ఉన్నతత్వము కలదని భావము.)


*ఆంతర్యము:*


“నన్నుఁ బొందెదరు నిత్య ధ్యాన పారీణలై." (శ్రీ మహా భాగవతము - దశమ స్కంధము -1471 పద్యము) అని ఉద్ధవుని ద్వారా శ్రీ కృష్ణుడు గోపికలకు పంపిన సందేశము మనకు ఆచరణీయము. ఆ నిత్య ధ్యాన భావనలలో ఉద్భవించినది పై సంకీర్తన.


*సొగసి యీ విభుని దాసుల కరుణ చాలదా*


వైష్ణవ సంప్రదాయములో భగవంతుని దాసునికి చాలా ప్రాముఖ్యత ఉంది. "దాసోఽహమ్” అని భావించి, భావించి క్రమక్రమముగా తమ ముందున్న దా(మ) బంధనాన్ని తొలగించుకొని “సోఽహమ్” గామారతారని వాళ్ళ నమ్మిక. ముకుందమాలలో "దాసదాస దాస..." అంటూ పరంపరగా చెప్పిన విషయం జగత్ప్రసిద్ధం. పూజారి కరుణిస్తే దేవుడు వరమిస్తాడు. ఎదుటి వారి చర్య భగవత్రీతికరమయితే దాసుని మోమున నవ్వు విరాజిల్లుతుంది. ఆ దాసులచూపు నగవుతో పరిఢవిల్లుతుంది. ఆ నవ్వు దయాకరమై, భక్తుల ఉన్నతికి కారకమవుతుంది. "అది చాలదా!" అని అన్నమయ్య అంతర్యము.


కార్తీక పౌర్ణమివంటి పవిత్రమైన దినములలో విష్ణువుకు ఎదురుగా ఒక కర్ర లేదా రాతి స్తంభాన్ని పాతి దానిపై దీపం వెలిగిస్తారు. ఇదే స్తంభ దీపం. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు బద్దలవుతాయని, విష్ణుమూర్తికి ఇష్టులవుతారని ఒక విశ్వాసం. విష్ణువు పాదాల ముంగిట అన్నమయ్య వెలిగించిన ఈ సంకీర్తనల దీపాలను చూసి మన జన్మ నిజంగానే ధన్యమవుతుంది. 🙏🏻





మీరు చెప్పిన దానిని బట్టి.,

గద్యం/వచనంలో దండకానికి ఛందస్సు(తగణ ప్రయుక్తము) ఉన్నది. ఆ సందర్భాలలో ఁ తో గురువు/లఘువు గా చేసుకునే సౌలభ్యం కోసమే ఁ ఉన్నది.


ఌౡ ల వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.

ౡత, కౢప్తము, భౡౢకము మొ॥


అలాగే ఱర లకు వినియోగము/ఉచ్చారణ ఒకనాడు వుండేది.


ఇప్పటికీ ళ ల, శ ష స - ల భేదము/వినియోగము/ఉచ్చారణ ఉన్నవి.


నేను ఇప్పటికీ అనేది ఒక్కటే . ఁ కు ఒకానొక కాలంలో ఉచ్చారణ ఉండి ఉంటుంది. దరిమిలాను, ఆ ఉచ్చారణను వదలిపెట్టి కేవలం వ్యాకరణ సూత్రములకే ఁ ను పరిమితం చేశారని నా మాట.

అందుకనే ఉచ్చారణ చూపకుండా ఁ తో పదములను చూపించడం మ్యూజియం ప్రదర్శన మాత్రమే అని నా అభిప్రాయం.




🙏మీరు అగ్నిని మరచినారు.


 *జామాతా జఠరం జాయా జాతవేదా జలాశయః

పూరితేనైవ పూర్యన్తే జకారాః పంచ దుర్లభాః* 


నాకు ఇప్పుడే తెలిసింది అండి. గూగుల్ ని అడిగితే.






శర్మాజీ!మీఅభిప్రాయంతోజోడుకలుపుతూ........

సం.వ్యా.శాస్త్రంలో

ద్వంద్వ సమాసపదాలలోఏదిముందు,ఏది వెనుక?

అనేమీమాంసవచ్చినపుడు:-

1)అల్పాక్షరంపూర్వం 

ఉదా:-రామలక్ష్మణులు.

2)అభ్యర్హితంచ(పూజ్యత)

ఉదా:-రాజ,సేవకులు

3)స్త్రీపుంవచ్చ.

ఉదా:-సీతారాములు

4)అజాద్యదన్తమ్ 

అచ్చులలోవర్ణక్రమాన్నిబట్టి(ద్వంద్వంలో)

ఉదా:-ఈశకృష్ణులు

ఈ,కృ.కృష్ణేశులనికాదు,[బహువచనం లో

ఈనియమంలేదు]

ఉదా:-అశ్వరథేంద్రులు.

5)ద్వంద్వే ఘి(ఇ,ఉ)

ఉదా:-హరిహరులు

కాన "అ"కంటే "ఇ"

ముందు వచ్చింది.

6)ఋతు,నక్షత్రాలలో 

వరుసను బట్టి,(సమానాక్షరాలలో)

ఉదా:-హేమంతశిశిరవసంతములు.కావున

గ్రీష్మవసంతములలో

అల్పాక్షరముగలదిముందువచ్చింది.

కృత్తికారోహిణులు.

7)వర్ణ(కుల)క్రమమున. ఉదా:-బ్రాహ్మణక్షత్రియులు

8)అన్నదమ్ములవరుసలో:-

ఉదా:-యుధిష్ఠిరార్జునులు,బలరామకృష్ణులు(కృష్ణబలరాములు

కాదు.

9)ఇలాగే చతురంగ బలాలు:-

ఉదా:-రథికాశ్వారోహ

కులు.

ఇలాంటివి ఇంకా తరచుగాఉపయోగింపనివికొన్నిఉన్నవి

వి.వి‌.హనుమంతాచార్యులు,ఖమ్మం.

9666846725.









*మనవారి మేధ*


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం (రెప్ప పాటుకాలం)

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము, ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ...లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం


పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం (చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

             (--భాగవతాదారితం )


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు. విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.





[12/01, 23:24] +91 94417 67340: *వాగ్దేవతలు*


*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :


*"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.*


*"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.*


*ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.*


*"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.*


*"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.*


*"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.*


*ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.*


*అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.*


*ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"*


*ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.*


*అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.*


*ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.*

*అంటే బ్రహ్మమే శబ్దము.*

*ఆ బ్రహ్మమే నాదము.*


*మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.*


*అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.*


*భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.*


*కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.*


*మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.*


*మనం చేసే శబ్దమే...ఆ దేవత..!*


*మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.*


*ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.*

*ఇది సనాతన ధర్మం.*

*ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.*


*శ్రీ మాత్రేనమః*

[13/01, 10:24] +91 79814 07839: అల్లసాని పెద్దన గారికి గండపెండేరం తొడిగించిన పద్యం-----పాడిన వారు సమ్మెట గాంధీ గారు

రాజన్న సినిమాలో తాత పాత్రధారి, నంది పురస్కార గ్రహీత

*****************************************

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా

కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని

ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్

బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ

కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్

జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే

ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్

గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు

న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం

బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా

సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ 

సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ

టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ

భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా

శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా

పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం

గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ

నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం

ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా

యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై

చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।






*భావగీతమ్*

*जयगुरुदत्त श्रीगुरुदत्त !:*

 నానా-ననననానా-ననననా


*శ్రుత్వా కవనధారా గుణనిభమ్*

*ధ్యాత్వా వదనమంబా సుతమహం*

*నత్వాచరణపంకేరుహమతిమ్*

*కాలీ జయతు నిత్యం శ్రితహితా*



 *చిన్తాహరతు గౌరీ హృది శివా।*

*పద్యం దిశతు హృద్యం సరసిజా।*

*జాఢ్యం తుదతు త్యాజ్యం హ్యఘహరా।*

*నిత్యం వసతు వాణీ మయి సదా।*


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️ విమల శ్రీ













*శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.*


*యద్యపి బహునాధీషే తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్ |*

స్వజనః శ్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా, 

సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -

            కళ్ళని -కల్లు 

            శిరీష-షిరీష 

            వేళ-వేల 

            కళ-కల 

            పళ్ళు-పల్లు 

            కాళ్ళు-కాల్లు 

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ శుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏


తెలుగు వారికి పురాణ గ్రంధమైన పెద్ద బాల శిక్ష 

దొరకటం మహా పుణ్య ఫలం..

ఆ మహాగ్రంధం చదివిన పెద్దలు,పిల్లలూ మహా

జ్ఞానులవుతారు..

అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది..

తప్పక చదవండి.

🙏





*ఈ క్రింది పద్యం చదవండి*..!"


  "మనమే మనమని మనమన మనుమని 


మనుమని మనుమనిమన నమ్మేనా?"


"మన మేనమామ మామను మునునేమిన


 మౌనిమౌని మనమున మౌనమే!"


*భావం*


"మనమే = మనం అందరమూ....,"


 "మనమని = శాశ్వతం కాదని"


 "మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"


" *మనుమని మనుమని మనుమని*" = 


"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"


"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"


"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"


"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"


"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"


" *మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని*"


"మౌనమే = మౌనంగా"


 "మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"


"*అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!*"


"ఎంతో లోతైన జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా మోక్ష పదమైన మకారంతో మలిచారు."


 " *తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం మినహా..!!*"


🕉️👏🙏🙏🙏🏻🕉️🙏🏻🙏🏻🙏👏🕉️

🙏🏻 * శుభాకాంక్షలతో*🙏🏻🇮🇳👏 ---------





*దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !*

.

ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.

పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా! 

'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు. 

దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది. 

సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు. 

జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ.. 

మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,


క. *జలచర ఢులి కిరి నరహరి*

*కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం*

*డిల తిరుపతి వేంకటశా*

*స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.*


అదీ వారి పాండిత్యం!




*కవిత్వం పై అభిరుచి ఉంటే చూడండి* 🌹🙏🌹


*ఇది మూలఘటిక కేతన 'ఆంధ్రభాషాభూషణము'లోని పద్యమని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ 'ప్రబంధరత్నావళి'లో కాకినాడ ఆంధ్రసారస్వతపరిషత్తులోని 'ఉదాహరణ పద్యములు' అనే ఒక వ్రాతప్రతి నుంచి దీనిని ఉదాహరించారు. అయితే ఈనాటి 'ఆంధ్రభాషాభూషణము' ముద్రిత ప్రతులలో ఇది లేదు.* ఏనాటి విమర్శకులకైనా ప్రబోధప్రాయమైన అందమైన పద్యం ఇది:


*మెచ్చుఁడు మెచ్చవచ్చు నెడ;*

     *మెచ్చకుఁ డిచ్చకు మెచ్చురానిచో;*

*మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు;*

     *మెచ్చక మెచ్చితిమంచుఁ గ్రుచ్చలై* 

*మెచ్చకుఁ; డిచ్చ మెచ్చుఁ గని*

     *మెచ్చుఁడు; మె చ్చొక మానమైనచో*

*మెచ్చియు మెచ్చకుండకయు* 

     *మెచ్చుఁడు సత్కవులార! మ్రొక్కెదన్.*


(మెచ్చుకోవలసిన చోట మెచ్చుకోండి. మనస్సులో మెచ్చుకోవాలని లేకపోతే మెచ్చుకోకండి. మెచ్చుకోవాలని ఉన్నా మెచ్చుకోకుండా మాటలు మింగకండి. మెచ్చుకోకుండానే మెచ్చుకొంటున్నామని కుచ్చితపుటిచ్చతో మెచ్చుకోకండి. మనస్సులో మెచ్చుకోవాలని అనిపించినప్పుడు అలాగే మెచ్చుకోండి. మెచ్చుకోవటం వల్ల తమ పెద్దరికానికేదో ముప్పువాటిల్లుతుందని అనుమానమైతే మెచ్చీ మెచ్చుకోనట్లుగా మెచ్చుకోండి. ఓ సత్కవులారా! మీకు నమస్కారం! - అని.)


         *-- ఏల్చూరి మురళీధరరావు*


🕉️🙏






కోధాకారాంకుశోజ్ఞ్వలా


క్రోధము అంటే ద్వేషము అనే పేరుకల మనోవ్యాపారము. మనకు ఇచ్చగనక బాగా కలిగినట్లైతే, అంటే ఒక మనిషియందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము

ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాం. అలాంటప్పుడు

ఒకవేళ మనం అనుకున్నట్లుగా గనకవారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేం.

ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేం. వారిమీద ఏదో కారణంగా కోపం పెంచుకుని

వారిని అసహ్యించుకుంటాం. దీనికి కారణము మనవారి పట్ల మనకున్న రాగము. దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటి వారు చేసిన

ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధము

క్రింద మారుతుంది. మనమీద మనకు నమ్మకముంటుంది. ఆత్మాభిమానం ఉంటుంది.

అంతవరకు మంచిదే. కాని అది బాగా పెరిగిపోతే దురభిమానమవుతుంది. అదే

ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం అందుకే


క్రోధో ద్వేషాఖ్యా చిత్త వృత్తిః


క్రోధము అనేది ద్వేషము అనే పేరుగల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపున్నటువంటి పై చేతిలో అంకుశమున్నది. అంకుశము బాధించేది. క్రోధము వల్ల ఇతరులకు

బాధకలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధము యొక్క ముఖ్యలక్షణము. అంకుశము

అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధము. అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశమున్నది.


ఇది భక్తులకు జ్ఞానరూపము. దుష్టుల ఎడ అంకుశము. క్రోధమనేది రజోగుణము.

అట్టి క్రోధాకారమైన అంకుశము చేతియందు గలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో చెప్పినట్లుగా


పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకే స్మృతౌ


దేవి పాశము అంకుశము ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు.

యోగినీహృదయంలో


ఇచ్చాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం


క్రియాశక్తిమయే బాణధనుషీ దధ దుజ్జ్వలమ్‌ ॥


పాశము - ఇచ్చాశక్తి. అంకుశము - జ్ఞానరూపము. ధనుర్బాణములు

క్రియాశక్తిమయాలు.


ఏదైనా జీవి హింసించబడేటప్పుడు, అది ఆ బాధ భరిస్తూ, ఎదిరించలేక “ఓ దేవీ! నన్ను హింసిస్తున్నారు. వారిని ఎదిరించే సామర్ధ్యము నాకులేదు. ముందు జన్మలోనైనా

ఇటువంటి వారిని ఎదిరించే సాహసము నాకు కలుగ జెయ్యవలసినది” అని ఏడుస్తూ

ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరము నశించినప్పుటికీ ప్రతీకారజ్వాల మాత్రం దాని

మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధము

అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికీ గతజన్మలోని

అనుభవాలే కారణము. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశశక్తి. పాపం చేసినటువంటి

వారికి ఇది అంకుశము. మిగిలినటువంటివారికి ఇది ఆభరణము. శ్రీచక్రంలోని ఎనిమిదవ

ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు.

ఓంఐంహ్రీంక్రోంక్రోం సర్వస్తంభనాభ్యాం

కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః అంకుశశక్తి

శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః

 

దుర్వాసుడు శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ


యః స్వాన్తే కలయతి కోవిద స్త్రీ లోకీ


స్తంభారంభణచణ మత్యుదారవీర్యం ।


మాత స్తే విజయమహాంకుశం స యోషా


న్దేవా స్పృమృయతి చ భూభుజోల న్యసైన్యమ్‌ |


తల్లీ ! ముల్లోకములను స్తంభింపచేయకల నీ అంకుశబీజమును ఉపాసన చేసేవాడు సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువులసైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు.


శ్రీ మాత్రే నమః



*పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..*


*పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..*


తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన


గానం. 

1. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

2. శోభారాజ్ గారు


రాగం. మోహన


స్వర రచన. డి. పశుపతి గారు


తాళ్లపాక వేంకటశేషాచార్యుల

వ్రాతప్రతి పుట: 52 సంకీర్తన: 51

ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 194

రేకు రాగము: శంకరాభరణం


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము

నెడయకవయ్య కోనేటి రాయడా


కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల

నేరిచి పెద్దలిచ్చిన నిధానమా

గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు

చేరువ చిత్తములోని శ్రీనివాసుడా


భావింప కైవసమైన పారిజాతమా, మమ్ము

చేవదేర గాచినట్టి చింతామణీ

కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము

తావై రక్షించేటి ధరణీధరా


చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా

లడచి రక్షించే దివ్యౌషధమా

బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము

గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా


విశ్లేషణ :


 - శ్రీ తాడేపల్లి పతంజలి గారు


     ఓ అయ్యా ! విష్ణు రూపమైన ( పురుషోత్తమా ) శ్రీ వేంకటేశ్వరా ! మిమ్మల్ని చూశాము ( పొడగంటిమి ). మిమ్ము చూసే ఆనందాన్ని మాకు దూరం చేయకు. పుష్కరిణి అనే కోనేరుకు ప్రభూ ( కోనేటి రాయడా ) ! మమ్మల్ని ఎప్పుడూ విడువకవయ్యా (ఎడయకవయ్య )!



1. మా కులానికి దేవుడివి నువ్వు. ఏరికోరి మమ్మల్ని పాలిస్తున్నావు. (ఏలినట్టి ). ఎంతో నేర్చుకున్న మా పెద్దలు  'ఈ స్వామి నిధి ( నిధానామా )' అని నిన్ను మాకు ఇచ్చి పోయారు. ఆ నల్లటి మేఘం నీటిని ఇచ్చి మా దాహాన్ని తీరుస్తుంది. స్వామీ ! నువ్వు కూడా ఆ కాలమేఘం (కాలమేఘమా) వంటివాడివి. మమ్మల్ని ఆదరించి ( గారవించి ) మా విజ్ఞాన దాహాన్ని పోగొడుతున్నావు. శ్రీనివాసుడా ! నువ్వు మా దగ్గరగా ( చేరువ ) వున్నావు. మా మనస్సులలో కూడా వున్నావు. ఎంత అదృష్టవంతులమయ్యా !


2. స్వామీ ! ఆ స్వర్గ లోకంలో ఎవరేది అడిగినా ఇచ్చే పారిజాతం ( సముద్రం వలన పుట్టింది ) ఉంటుందట కదా ! మేమందరం కలిసి ఆలోచించి ( భావింప) ఒక తీర్మానానికి వచ్చాము. మా ఆధీనంలో ఉన్న ( కైవసమైన ) పారిజాతానివి నువ్వే !  ఆ దేవలోకంలో ఉన్న చింతామణి అనే మణి దుఃఖాలను పోగొడుతుందట. మా చింతలన్నింటిని పోగొట్టి మాకు శక్తి ఇచ్చి రక్షించిన ( గాచినట్టి ) చింతామణివి నువ్వే ! మా పనులన్నింటిని పూర్తి చేసి ( కావించి ) మా కోరికలన్నీ తీర్చే కామధేనువు నువ్వే ! 


3. ' శ్రీ వెంకటేశాయ నమః ' అని భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ! చెడు అనేది కలగనే కలుగదు ( చెడనీక ). ఎటువంటి కష్టాన్ని అయినా పోగొట్టి బతికించి అన్ని లాభాలు కలిగించే మంత్రం అది ( సిద్ద మంత్రమా ).  ఆ మంత్రానివి నువ్వే. మాములు రోగాలు పోవటానికి ( అడచి ) వైద్యుడి రూపంలో నిలిచి ( మందు ) ఇస్తావు. భవరోగాలు ( సంసారము ) పోవటానికి కూడా నిన్ను శరణు కోరటమనే గొప్ప మందును ( దివ్యఔషధం ) ఇచ్చి మమ్మల్ని రక్షించావు. ఎప్పుడూ మమ్మల్ని విడువక మా వెంట ఉండి మాతోనే తిరుగుతుండే ( బడిబాయక ) మా ప్రాణ సమానమైన చుట్టానివి ( ప్రాణ బంధుడా ) నువ్వే ! మమ్మల్ని కల్పించిన ( గడియించినట్టి ) శ్రీ వెంకటగిరి పర్వత రాజువి ( శ్రీ వెంకట నాధుడా ) నువ్వే !🙏🏻


*విశేషాలు:*


*నాన్నగారు* అంటే గౌరవం. మనస్సుకు కొంచెం దూరం. *అయ్య* అంటే మనస్సుకు చాలా దగ్గర. *అయ్య* అని పిలవ వలసిన తీరులో పిలిస్తే, ఎదుటివాడి శరీరంలో రక్తం కాసేపు ప్రవహించటం మానేసి, ఆత్మీయత ఉరకలెత్తుతుంది. ఆ ప్రేమశక్తిని గ్రహించిన అన్నమయ్య - జగాలను కన్న తండ్రిని *'అయ్య'* అని పిలిచాడు. 


నిధానము (= నిధి), నిధనము (= మరణము) దగ్గర సంబంధమున్న పదాలు. ధన సంబంధం దేనిలో పోతుందో అది నిధనం. దేనిలో ఉంటుందో అది నిధానం. అసలైన ధనం మనమనుకొనే ఆస్తులు కాదు. స్వామి అనుగ్రహం అనేది ఒక నిధి అని పెద్దలు నేర్చుకొని, తరతరాలకు తరగని నిధిలా దానిని మనకు ఇచ్చిపోయారట. నిధనము వచ్చేలోగా స్వామి అనుగ్రహం కోసం తాపత్రయ పడమని కవి ఉపదేశిస్తున్నాడు.


మనస్సులను ప్రేరేపిస్తుంది కాబట్టి నలుపు రంగుకు కాలమని ఇంకొక పేరు. తడిపేది మేఘం. నల్లగా ఉన్న స్వామి అన్నమయ్యకు కాలమేఘమయ్యాడు. ఆర్తుడు, జ్ఞానుల్లో సామాన్యమైన లక్షణం తహ తహ. ఇది దాహానికి సంకేతం. 'ఈ దాహాన్ని పోగొట్టే నల్లటి మేఘం నీ ఎదురుగా ఉంది. ఇతర దాహాలు మానేసి నిరంతరం స్వామిని పాడాలనే దాహం పెంచుకో! తప్పకుండా ఆ కాలమేఘం ఆదరించి (= గారవించి) దాహాన్ని పోగొడుతుందని కవి అభయం.


 మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం అని అయిదు దేవ తావృక్షాలున్నాయి. ఎవరేది అడిగినా, అది ఇచ్చే ఆ పారిజాతం ఇంద్రుడి ఆధీనంలో ఉంటుంది. కాని మన అధీనంలో ఉన్న పారిజాతం స్వామి అని కవి చమత్కారం. 


వరాహావతారంలో స్వామి భూమిని మోశాడు. అందుకే ఆయన ధరణీధరుడు. తిరుమలలో స్వామివారు ఉండటానికి స్థానాన్నిచ్చింది వరాహస్వామి. అందుకు ప్రతిఫలంగా మొదటి దర్శనం వరాహస్వామి పొందాడు. తిరుమల వెళ్లినవారు వరాహస్వామిని చూడకుండా వేంకటేశ్వర దర్శనం చేసుకోకూడదు. ఇద్దరూ ఒకటే అని జ్ఞాపకం చేస్తూ, 'తావై' అన్నమాటలో వరాహస్వామి విశిష్టతను కవి తెలియజేశాడు. 


వైద్యోనారాయణో హరిః అంటుంది మన సంప్రదాయం. అన్నమయ్య కూడ స్వామివారిని వైద్యునితో పోల్చి, ఆయన ప్రసాదించిన శరణం అనే ఔషధాన్ని భక్తితో సేవించమన్నాడు. 


ప్రీతిని కలిగించేవాడు బంధువు. వేంకటేశ్వరస్వామి ప్రాణ బంధువు. మనకున్న పంచప్రాణాలలో ఒకటి వాక్కు అనే ద్వారంలో ఉంటుంది (నాగం). రెండోది కంటి రెప్పలలో ఉంటుంది (కూర్మం). మూడవది ముక్కులో ఉంటుంది (కృకరం). నాలుగవది కంఠం అనే ద్వారంలో ఉంటుంది (దేవదత్తం). అయిదవది శరీర మంతటా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు శరీరానికి బలం ఇస్తుంది (ధనంజయం). ఈ ప్రాణాలు ప్రతి జీవికి చాలా చాలా ఇష్టమైన బంధువులు. ఈ అయిదు ప్రాణ వాయువులలో ఏ ఒక్క బంధువు తన దగ్గరనుంచి వెళ్లటానికి జీవి ఇష్టపడడు. మనలిని విడవకుండ ఉండే ఈ ప్రాణాలంటే ఎంత ఇష్టపడతామో, స్వామి అంటే కూడ అంతే ఇష్టపడాలని అన్నమయ్య ఆయనని ప్రాణబంధువన్నాడు. 


*'ఓం నమో వేంకటేశాయ'* సిద్ధమంత్రం. అంటే ఏది కావాలన్నా ఆ సిద్ధిని కలిగించే మంత్రం. పరమేశ్వరుడు మన కంటికి కనిపించే విగ్రహ రూపంలో, మంత్ర రూపంలో, యంత్ర రూపంలో ఉంటాడు. *'చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా'* అనే పాదంలో మంత్ర రూపంలో ఉన్న స్వామిని అన్నమయ్య కీర్తించాడు. స్వస్తి.🙏🏻






*గసడదవాదేశ సంధి:*



 గసడదవాదేశ సంధి మూడు రకాలుగా జరుగుతుంది

1)ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.

పరుషములు: క చ ట త ప అను ఐదు వర్ణములు పరుషముల స్థానమున గ స డ ద వ అనే ఐదు వర్ణములు ఆదేశంగావస్తాయి

క - గ, చ - స, ట - డ, త - ద, ప - వ

ఉదా: వాడు+కొట్టె = వాడుగొట్టె - వాడుకొట్టె (వైకల్పికం అంటే రావచ్చు, రాకపోవచ్చు)


లెస్స+కాను =లెస్సగాను (నిత్యము అంటే తప్పనిసరి గా వస్తుంది)

అపుడు + చనియె = అపుడు సనియె/అపుడు చనియె

నీవు + టక్కరివి = నీవు డక్కరివి/నీవు టక్కరివి

మీరు +తలఁడు= మీరు దలఁడు/మీరు తలఁడు

వారు + పోరు = వారు వోరు/వారు పోరు.

అలాగే కళలగు క్రియా పదములమీద సహితం కనపుడుతున్నది.

రారు + కదా= రారు గదా/రారు కదా

వత్తురు +పోదురు = వత్తురు వోదురు/వత్తురు పోదురు


2)తెనుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు

 

తెనుగుల మీది అంటే అచ్చ తెలుగు పదాల పరమైన, సాంస్కృతిక అంటే సంస్కృత పదాల లోని పరుషములకు గసడదవలు రావని సూత్రార్థము


ఉదా!! వాడు+ కంసారి

     వాడు అనునది అచ్చ తెలుగు పదము

  దానికి కంసారి అను సంస్కృత పదంలోని క అను పరుషము పరమైనది .ఆ పరుషము గ గామారదు

కావున

వాడు కంసారి అనే ఉంటుంది.


వీడు + చక్ర పాణి - వీడు చక్రపాణి

ఆయది + టంకృతి = ఆయది టంకృతి

అది + తథ్యము = అది తథ్యము

ఇది + పథ్యము = ఇది పథ్యము.


ఇవి పైన వాడి కంసారి వలె రూపసాధన చేసుకోవాలి.


3)ద్వంద్వంబున పదంబుపై పరుషంబునకు గసడదవలగు


ద్వంద్వంబున అంటే ద్వంద్వ సమాసంలో

పదంబుపై అంటే పూర్వ పదానికి పరమైన పరుషం స్థానంలో గసడదవలు వస్తాయి


తల్లి+తండ్రి = పరపదంలోని త స్థానంలో గసడదవలలోని ద వచ్చి తల్లిదండ్రులు అవుతుంది.


కూర + కాయ = కూరగాయలు

కాలు + చేయి = కాలుసేతులు

టక్కు + టెక్కు = టక్కుడెక్కులు

ఊరు + పల్లె = ఊరువల్లెలు.


✍️ పైడి నాగ సుబ్బయ్య.

No comments: